‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఒకేసారి క్రేజీ హీరోగా మారిన కార్తికేయ ఆతరువాత నటించిన ‘హిప్పీ’ ఫెయిల్ అవ్వడంతో ఈ యంగ్ హీరో కెరియర్ పై సందేహాలు మొదలయ్యాయి. దీనితో కార్తికేయ లేటెస్ట్ గా నటించిన ‘గుణ 369’ ఫలితం అత్యంత కీలకంగా మారింది. ఈమూవీ మొన్న విడుదలైన నేపధ్యంలో ఈమూవీ సక్సస్ అయింది అంటూ ఈసినిమా యూనిట్ నిన్న నిర్వహించిన సక్సస్ మీట్ లో కార్తికేయ తల్లి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 

వాస్తవానికి తన కొడుకు సినిమా రంగంలోకి రావడం తనకు ఇష్టం లేదని అందువల్లనే అతడు నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సక్సస్ సాధించినా తాను ఆనంద పడలేదని అంటూ ఆమె కామెంట్స్ చేసింది. అయితే ‘గుణ 369’ మూవీ చూసిన తరువాత తన అభిప్రాయం మారిపోయిందని ఒక మంచి సినిమాలో తన కొడుకు హీరోగా నటించినందుకు తాను గర్వపడుతున్నాను అంటూ ప్రశంసలు కురిపించింది.

డైరెక్టర్ బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ విషయంలో వెనకపడి ఉంది. అయితే ఈమూవీలో నటించిన కార్తికేయ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

మొదట్లో తన ‘ఆర్ ఎక్స్ 100 సూపర్ సక్సస్ అయినందుకు తాను చాల ఆనంద పడ్డానని అయితే తాను ప్రస్తుతం జనం మధ్యకు ఎక్కడకు వెళ్ళినా తనను కార్తికేయగా
కాకుండా ‘ఆర్ ఎక్స్ 100’ హీరోగా గుర్తిస్తున్న పరిస్థితులలో తన ప్రతి సినిమాను ‘ఆర్ ఎక్స్ 100’ తో పోల్చడం తనకు భయాన్ని కలిగిస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు. ఈవీకెండ్ కు వచ్చిన రెండు చిన్న సినిమాలలో ‘గుణ 369’ కంటే ‘రాక్షసుడు’ కలక్షన్స్ విషయంలో పై చేయి సాధించడంతో కార్తికేయకు మరొకసారి నిరాశ ఎదురైందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: