ఈ మధ్య సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి అప్లాజ్ వస్తుంది. చాలా వరకు మన సినిమాల్ని రీమేక్ చేస్తున్నారు. మాస్ మసాలా సినిమాలు తీయడంలో దిట్ట అయిన సౌత్ ఇండస్ట్రీ నుండి చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. బాలీవుడ్ బాద్ షా  సల్మాన్ ఖాన్ పనైపోయింది అనుకున్న తరుణంలో వాంటెడ్ తో  విజయాన్ని అందుకున్నాడు. తెలుగు పోకిరి సినిమాకు హిందీ రీమేకే "వాంటెడ్". ఆ తర్వాత సల్మాన్ ఖాన్ చాలా సినిమాల్ని రీమేక్ చేసాడు.


అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గ పేరున్న ఆమీర్ ఖాన్ మరో సౌత్ సినిమాని రీమేక్ చేయనున్నాడని సమాచారం. ఆయన నటించిన "థగ్స్ ఆఫ్ హిందూస్తాన్" ఘోర పరాజయం తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఆమీర్ ఖాన్..ఈ సారి రీమేక్ ని నమ్ముకోవాలనే అనుకున్నాడట. అయితే ఆమీర్ ఖాన్ కి రీమేక్ లు చేయడం కొత్తేం కాదు. తమిళ చిత్రం "గజిని" ని హిందీలో రీమేక్ చేసి పెద్ద హిట్టు కొట్టాడు.


ఇప్పుడు కూడా మరో తమిళ చిత్రాన్నే రీమేక్ చేయనున్నాడట. హిట్ మూవీ 'విక్రమ్ వేద' హిందీలో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో నటించడానికి అమీర్ ఖాన్ అంగీకారం తెలిపారని, అక్కడ కూడా ఇదే పేరుతో దీన్ని రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అమీర్ ఖాన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు టాక్.


ఇందులో అమీర్ ఖాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా లీడ్ రోల్ చేయబోతున్నారు. సైఫ్ ఇందులో మంచి పోలీస్‌గా కనిపిస్తారట. తమిళంలో దర్శకత్వంలో వహించిన గాయిత్రి పెష్కర్ హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం. 2020 మార్చిలో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ " లాల్ సింగ్ చద్దా" అనే బయోపిక్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆమీర్ కి జోడీగా కరీనా కపూర్ నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: