సస్పెన్స్ థ్రిల్లర్లను బిగి సడలకుండా రూపొందిస్తే.. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.. దర్శకులను అగ్రస్థానంలో నిలుచోబెడతాయి.. నిర్మాతలకు తక్కువ డబ్బుతో కోట్లు సంపాదించి పెడతాయి.. ఈ జోనర్ సినిమాలకు కావాల్సింది పక్కా స్క్రిప్టు.. కథకు అనుగుణమైన సంగీతం.. కాస్త యాక్షన్.. అడవి శేష్ ఇప్పటికే ఈ జోనర్ లో గూఢచారి సినిమాతో మంచి హిట్ కొట్టాడు..ఇప్పుడు మరింత పకడ్బందీ సస్పెన్స్ కథతో ఎవరు సినిమాతో ముందుకు వస్తున్నాడు..


తాజాగా విడుదలైన ఈ ఎవరు ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్లలో ఉండే రొటీన్ కథాంశాలే అయినా వరుస హత్యలు.. హంతకుడి వేట.. ఇదే ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఇందులో సబ్ ఇనస్పెక్టర్ గా అడవి శేష్ కనిపిస్తున్నారు. అయితే ఈ పాత్రలో ఎన్టీఆర్ టెంపర్ షేడ్ కాస్త కనిపిస్తోంది.


విక్రమ్ వాసుదేవ‌.. అడవి శేష్ పాత్ర పేరు.. లాంచాలకు అలవాటు పడిన పోలీస్ అధికారిగా పేరున్నట్టు డైలాగులను బట్టి తెలుస్తోంది. ఈ హత్యల కేసులో ఇరుకున్న అమ్మాయిగా రెజీనా కసాండ్ర నటిస్తోంది. ఇంతకీ ఆమె బాధితురాలా.. హంతకురాలా అన్నది మాత్రం రివీల్ కాలేదు.


నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. నేను తనని మంచి ఫ్రెండ్ అనుకున్నానని రెజీనా చెబుతోంది. కథ ప్రధానంగా ఈ మూడు పాత్రల మధ్యే తిరిగేలా కనిపిస్తోంది. హత్య, అత్యాచారం ప్రధానాంశాలుగా కథ ఉన్నట్టుంది.


ప్రతి కథ వెనుకా ఓ రహస్యం ఉంది అంటూ కథ సాగుతుంది. చివరలో నాకు భయం వేసింది అని రెజీనా అంటే.. అంత భయం వేసినా సింపుల్ గానే చంపేశారుగా అంటాడు అడవి శేష్.. అంటే హంతకురాలు రెజీనాయేనా.. అన్న ట్విస్ట్ రివీల్ కావాల్సి ఉంటుంది. ట్రైలర్ మాత్రం మాంచి ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.


ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. గూఢచారితో అలరించిన అడవిశేష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అనిపిస్తోంది. ఈ ఆగస్ట్ 15కు సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. పీవీపీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు వెంకట్ రాంజీ దర్శకుడు. వంశీ పచ్చిపులుసు ఫోటోగ్రఫీ..


మరింత సమాచారం తెలుసుకోండి: