గత ఏడాది ప్రారంభంలో  భాగమతి సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది సౌత్   స్టార్ హీరోయిన్ అనుష్క.  అశోక్  దర్శకత్వంలో  లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రందాదాపు 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లీడింగ్ ప్రొడక్షన్  హౌస్ యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఈ చిత్రం   తరువాత బరువు తగ్గడం కోసం చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవల 'నిశ్శబ్దం' అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే.  ఇక ఈ రోజు  తో ఈచిత్రం యొక్క  షూటింగ్  పూర్తయింది. 




 హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో  తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తుండగా   ప్రముఖ నటుడు సుబ్బరాజు,   హీరోయిన్  అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు ప్రముఖ  హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్  అంత  యూఎస్ లోని సియాటెల్ లోనే జరిగింది.   గోపి సుందర్  సంగీతం అందిస్తుండగా   కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈచిత్రాన్ని  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   ఇక ఈ చిత్రాన్ని తెలుగు , తమిళంతో,  హిందీ పాటు ఇంగ్లీష్  లోనూ విడుదలచేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఈఏడాది చివర్లో  ప్రేక్షకులముందుకు  తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.



ఇక ఈచిత్రం తరువాత  అనుష్క ప్రముఖ  దర్శకుడు రాఘవేంద్ర రావు  నిర్మించనున్నభారీ  చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా  వార్తలు వస్తున్నాయి.  ఏకంగా ముగ్గురు  డైరెక్టర్లు కలిసి  డైరెక్ట్ చేయనున్న ఈచిత్రంలో అనుష్క , యువ హీరో నాగ శౌర్య కు జోడీగా నటించనుందట.  అయితే త్వరలోనే ఈ వార్తలపై ఓ క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: