టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. అయితే గత కొంత కాలంగా రానా ఆరోగ్యం పై అనేక కథనాలు వస్తున్నాయి. ఓ బేబి థ్యాంక్స్ మీట్ లో రానా చాలా సన్నగా కనిపించాడని, అలా అవడానికి కారణం ఆయన ఆరోగ్యం బాగోలేదంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఎప్పటి కప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నా పుకార్లు మాత్రం తగ్గడం లేదు.


అయితే తాజాగా రానా రానా అమెరికా వెళ్లడం తో ఇంకాస్త ఆ వార్తలు వైరల్ చేస్తున్నారు. రానా కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని... కిడ్నీ మార్పిడి చేసుకునేందుకే రానా అమెరికా వెళ్లాడని..తన తల్లి ఓ కిడ్నీ ని రానా కు ఇచ్చిందని..ఆ ఆపరేషన్ అమెరికా లో జరిగిందని ఇలా ఎవరికీ వచ్చినట్లు వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. 


ఈ వార్తలు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం..చాలామంది ఇదా నిజామా అన్నట్లు రానా కుటుంబ సబ్యులకు ఫోన్లు రావడం తో ఇక వీటికి ఫుల్ స్టాప్ పెడదామన్న ఉద్దేశ్యంతో ఈ వార్తలపై స్పందించారు రానా.తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన అమెరికా టూర్ విశేషాలను పంచుకున్నారు. గుణ శేఖర్ కొద్దినెలల క్రితం రానా తో “హిరణ్యకశిప” అనే భారీ పౌరాణిక చిత్రం చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే.


 త్వరలో ఈ చిత్రం  ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్న నేపథ్యంలో రానా అమెరికా వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “హిరణ్యకశిప”మూవీ విజువల్ ఎఫెక్ట్స్, అలాగే మేకప్ తదితర అంశాలకు సంబంధించిన నిపుణులతో రానా చర్చలు జరపడానికే అమెరికా వెళ్లారని, తన  ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. రానా ప్రస్తుతం "విరాట పర్వం" ,"హాథీ మేరె సాథీ" అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: