ఈ రోజు తెలుగు వారు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ..ముఖ్యంగా మహిళలు శ్రావణ శుక్రవారం జరుపుకునే గొప్ప పండుగ వరలక్ష్మీ వ్రతం.  ఈరోజు నోములు నోచుకొని ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇస్తారు. తమ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు చేసుకునేదే వరలక్ష్మీ వ్రతం.  ఈ రోజు లక్ష్మీ దేవికి పూజలు చేస్తే ఆ కుటుంబం చల్లగా ఉంటుందని మహిళల నమ్మకం. ఇక శ్రావణ మాసం..వరలక్ష్మీ వ్రతం రోజున ఆడపిల్ల పుడితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఇంటికి వచ్చినంత ఆనంద పడుతుంటారు. 

ఇప్పుడు ఈ ఆనందం మంచు కుటుంబంలో చోటు చేసుకుంది.  మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇంట పండంటి ఆడపిల్ల పుట్టింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

దర్శక,నిర్మాత, నటుడిగా ఆయన తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నారు.  ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన తనయులు మంచు విష్ణు, మనోజ్ లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆయన కూతురు మంచు లక్ష్మి నటిగా, బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతుంది.  ప్రస్తుతం మంచు విష్ణు ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.  కాగా విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అరియానా, వివియానా కవలలు.

తాజాగా మంచు వారింటికి మహాలక్ష్మి వచ్చినంత ఆనంద పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి విష్ణుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇకపై మీకు అన్నీ శుభాలే’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: