కమల హాసన్ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలబడిపోయిన సినిమా భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో సంచలనాలనే కాదు డైరెక్టర్ గా శంకర్ కి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఇక శంకర్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నిటిలో కంటే భారతీయుడు ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు-2 తెరకెక్కించబోతున్నాడు శంకర్. అయితే ఈ సినిమా దర్శక-నిర్మాతలకు వచ్చిన విభేదాల వల్ల కొంతకాలం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.

రోబో 2.ఓతర్వాత శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్‌ ను ఘనంగా ప్రారంభించిప్పటికి.. మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ తరువాత తిరిగి షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ విషయంలో శంకర్ కి లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు రావడంతో ఈ సినిమా ఆగిపోయింది. అయితే ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరి లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఇచ్చిన బ‌డ్జెట్ ప‌రిమితుల్లోనే, శంకర్ సినిమా చెయ్యడానికి అంగీకరించడంతో సినిమా మళ్లీ మొదలైంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారం నుండి రాజమండ్రిలో ప్రారంభం కాబోతోందట. ఇదే విషయాన్ని కాజల్ కూడా అప్‌డేట్ చేయడంతో ఈ వార్తలో నిజముందని తెలిసిపోయింది.

అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ షెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం ఒకేసారి ఎక్కువగా డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో కమల్ సరసన హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2020లో ఈ సినిమా విడుదలచేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించబోతున్నారని మరో లేటేస్ట్ న్యూస్. 



మరింత సమాచారం తెలుసుకోండి: