యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన లేటెస్ట్ సినిమా సాహో ట్రైల్లర్ విడుదలై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన గొప్ప అనుభవం గురించి వెల్లడించారు ప్రభాస్. మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి, అభినందించి, ప్రశంసలు కురిపించడంతో తనకు గూస్ బంప్స్ వచ్చాయని ప్రభాస్ సంబరపడిపోతున్నారు. మెగాస్టార్ ఇలా అభినందించడం సాహో టీమ్ కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రభాస్, హీరోయిన్ శ్రద్ద కపూర్, నిర్మాతలు ప్రమోద్, వంశీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

దర్శకుడు రాజమౌళి స్పందన ఏమిటి? ట్వీట్ కూడా చేయలేదుగా? అని మీడియా ప్రశ్నించారు. ఆయనకు నచ్చిందని, పర్సనల్ గా ఫోన్ చేసి మెచ్చుకున్నారని ప్రభాస్ తెలిపారు. ఇక ట్రైలర్ ను ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేయడానికి దర్శకుడు సుజిత్, అతని టీమ్ చాలా కష్టపడ్డారని, బోలెడు కట్ లు చేసి, చేసి ఆఖరిది ఇది పైనల్ చేసారని చెప్పాడు. బాహుబలి లో కథ బలంగా వుంటుందని, అందుకే దాని తరువాత అంతకన్నా గొప్ప కథ కుదరలేదు కనుకే, స్క్రీన్ ప్లే ప్రధానంగా నెక్స్ట్ సినిమాను చేయాలనే సాహో ను ఎంచుకున్నామని వెల్లడించారు. అయితే సాహో కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, మంచి లవ్ స్టోరీ కూడా వుంటుందని ప్రభాస్ అన్నారు.  

బాహుబలి తరువాత ఆ సినిమా అభిమానులను, తన అభిమానులను నిరాశ పర్చకుండా మంచి సినిమా అందించగలిగితే చాలని, బాలీవుడ్ బాద్ షాల్లాంటి ఆలోచనలు లేవని అన్నారు. బాహబలి వన్ విడుదల కాకముందే సాహో సబ్జెక్ట్ ను సుజిత్ చెప్పాడని, అయితే బాహుబలి వరల్డ్ వైడ్ గా విజయం సాధించడంతో సాహో ను కూడా అన్ని ప్రాంతాలకు నచ్చే విధంగా తీయాలని ప్లాన్ చేసామన్నారు. అందుకే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కొన్ని వేల స్కోర్ బోర్డ్ లు వేసారన్నారు. టాప్ టెక్నీషియన్స్, విదేశీ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడం గొప్ప అనుభూతి అని ప్రభాస్ అన్నారు. ఇక ప్రభాస్ సాహో తర్వాత తన సొంత బ్యానర్‌పై నిర్మించబోయో సినిమాలో నటిస్తాడు. ఈ సినిమా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నిర్మించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: