మూడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. మొదటివారం బిగ్ బాస్ షో నుండి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం జాఫర్, మూడవ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో చాలా తెలివిగా వ్యవహరించాడు. ఇద్దరు ఇంటి సభ్యులను కన్ఫెషన్ రూమ్ కు పిలిచి ఇద్దరిలో ఒకరు సేఫ్ కావాలని, ఒకరు ఎలిమినేషన్ కొరకు నామినేట్ కావాలని చెబుతాడు బిగ్ బాస్. 
 
అలీ, పునర్నవి గత వారం టాస్కులో గెలవడంతో బిగ్ బాస్ వారికి ఈ వారం ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇచ్చాడు. గత వారం టాస్కులో రవికృష్ణకు గాయం కావటానికి శ్రీముఖి కారణమని శ్రీముఖిని బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేసాడు. మొదట వితిక, రవికృష్ణ ఇద్దరినీ పిలవగా ఎప్పుడూ నువ్వు నామినేట్ అవుతున్నావు కదా అని చెప్పి రవికృష్ణ నామినేట్ అవుతాడు. రోహిణి, శివ జ్యోతి ఇద్దరినీ పిలవగా శివజ్యోతి ఎలిమినేషన్ కు నామినేట్ అవుతుంది. 
 
కానీ శివజ్యోతి, రోహిణి బయటకు వచ్చాక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించటంతో బిగ్ బాస్ రోహిణిని కూడా నామినేట్ చేస్తాడు. వచ్చే వారానికి కూడా శివజ్యోతి, రోహిణి ఇద్దరినీ బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేస్తాడు. బిగ్ బాస్ వరుణ్, మహేశ్ ఇద్దరినీ పిలవగా మహేశ్ నేను టెన్షన్ భరించలేనని, నాకు ఎక్కడో చిన్న భయం ఉందని వరుణ్ ను నామినేట్ చేస్తాడు . బాబా భాస్కర్, అషు రెడ్డిని బిగ్ బాస్ పిలవగా బాబా భాస్కర్ నామినేట్ అవుతాడు. 
 
హిమజ, రాహుల్ ఇద్దరినీ బిగ్ బాస్ పిలవగా హిమజ నేను నాకోసమే గేమ్ ఆడుతున్నానని చెబుతుంది. రాహుల్ నామినేట్ కాగా హిమజ సేఫ్ అవుతుంది. బిగ్ బాస్ షోలో ఈ వారం రవికృష్ణ, శివజ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, శ్రీముఖి నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ ప్రతిసారి ఇద్దరిని పిలిచి ఒకరు నామినేట్ అయ్యేలా, మరొకరు సేఫ్ అయ్యేలా భలే ప్లాన్ చేసాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: