నవీన్ పోలిశెట్టి  ఇటీవల ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీ లో మారు మోగింది.  దానికి కారణం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే సినిమా. జూన్ లో  విడుదలైన ఈ చిత్రం  సూపర్ హిట్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  మంచి వసూళ్లను రాబట్టుకుంది.   ఈసినిమాలో  నవీన్ నటనకు విమర్శకులు  ప్రశంసలు కురిపించారు.  ఇక ఈ సినిమా తరువాత నవీన్ తెలుగులో  మరో చిత్రానికి సైన్ చేసాడు.


ఆయన , పిట్టగోడ ఫేమ్ అనుదీప్  డైరెక్షన్ లో నటించేందుకు ఓకే చెప్పాడు.  ఈసినిమా కు   జాతి రత్నాలు అనే ఇంట్రెస్టింగ్  టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం.   ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  హైదరాబాద్ లో జరుగుతుంది.  ముగ్గురు యువకుల జీవితాల  ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి అందులో ఒక పాత్రలో నటిస్తుండగా మిగితా పాత్రల్లో పాపులర్ కమెడియన్లు ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ నటించనున్నారు. వీరి కాంబినేషన్ లో  వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా వుండనున్నాయట.    


 కాగా  తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో  రూపొందుతున్న ఈ చిత్రంలో నవీన్  తెలంగాణ స్లాంగ్ లో  డైలాగులు చెప్పనున్నాడు. లో బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి , రైజింగ్  కమెడియన్ వెన్నల కిశోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  మహానటి చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,స్వప్న సినిమాస్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు  రానుంది. కాగా నవీన్ పోలిశెట్టి ఈసినిమాతో పాటు బాలీవుడ్ లో ప్రస్తుతం  ఛిచ్చోరె అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: