బాలీవుడ్ సంచలన తార, సింగర్ రాఖీ సావంత్ అంటె తెలియని వారు ఉండరు. ప్రతిసారి సోషల్ మీడియాలో ఏదో ఒక కాంట్రవర్సీలకు తెరలేపుతూ ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న ఈ నటికి ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అది కూడా ఎవరో కాదు తన మాజీ ప్రియుడు అంటూ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మద్యే రాఖీ సావంత్ రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా రాఖీ సావంత్ వివాహం విషయంపై ఎన్నో సంచలన కథనాలు వచ్చాయి..కానీ తర్వాత అవన్నీ వట్టి కట్టుకథలే అని తేలాయి. అంతే కాదు ఆ మద్య రాఖీసావంత్ స్వయంవరం కార్యక్రమం కూడా ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. 

ఈ కార్యక్రమంపై ఎన్నో ఆరోపణలు, కాంట్రవర్సీలు వచ్చాయి.  తాజాగా ఇప్పుడు తనను తన మాజీ ప్రియుడు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది రాఖీసావంత్. ఇటీవల తన రహస్య వివాహం గురించి కొన్ని రోజుల తర్వాత కానీ బయటపెట్టలేదు రాఖీ సావంత్.  తాజాగా ఈ పెళ్లిపై రాఖీ మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ అయ్యారు. ఆ మద్య దీపక్ తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో ఈమె ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తన భర్త యూఎస్ వెళ్లిపోయారని..తనకు వీసా రాగాను తాను కూడా అక్కడికి వెళ్లిపోతానని, అక్కడే తను హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తానని ఓ మీడియాలో తెలిపింది. తాను కోరకున్న వనిత మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక పోయిన దీపక్ తాను ఆవేదనుకు గురయ్యానని, మోసపోయానని అందుకు కారణం అయిన రాఖీ సావంత్ తనకు నాలుగు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నాలుగు రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేశానని బెదిరించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన రాఖీ సావంత్ అతనిపై సీరియస్ అయ్యింది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం..న భర్త గురించి తప్పుగా మాట్లాడడాన్ని భరించలేని రాఖీ.. దీపక్ ఖలాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: