‘సాహో’ విడుదల కాకుండానే తెలుగు రాష్ట్రాలలో ‘బాహుబలి 2’ రికార్డులకు చెక్ పెడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి 2’ మన తెలుగు రాష్ట్రాలలో విడుదలకు ముందు 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ‘సాహో’ మన తెలుగు రాష్ట్రాలలో 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం సంచలనంగా మారింది. దీనితో ‘బాహుబలి’ రికార్డులను ‘సాహో’ బ్రేక్ చేసింది అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 

ఈ మూవీ కేవలం సీడెడ్ ప్రాంతానికి 25 కోట్లకు అదేవిధంగా కోస్తాజిల్లాల ప్రాంతాలకు 60 కోట్లకు ఈ మూవీ రైట్స్ అమ్మకం జరిగింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల మైండ్స్ ను బ్లాంక్ చేస్తోంది. ఈ మూవీ నైజాం ఏరియా రైట్స్ 40 కోట్లకు అమ్మకం జరిగింది అన్న వార్తలు విన్నవారు ఈ మూవీ పై బయ్యర్లు పెట్టుకున్న అంచనాలు చూసి షేక్ అవుతున్నారు. 

దీనితో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తున్న ట్రేడ్ వర్గాలు ఖచ్చితంగా ‘సాహో’ ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ ను బ్రేక్ చేసింది అన్న నిర్ణయానికి వస్తున్నారు. ఈ స్థాయిలో జరిగిన ఈ మూవీ బిజినెస్ ను పరిశీలిస్తున్న వారు ఈ మూవీ బయ్యర్లు గట్టెక్కాలి అంటే కేవలం మన తెలుగు రాష్ట్రంలోనే ఈ మూవీకి 300 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి అన్న అంచనాలు వేస్తున్నారు. 

దీనితో ఈ సినిమాకు మొదటి రోజు మొదటి షో నుండి టోటల్ పాజిటివ్ టాక్ రావాలని లేకుంటే ఈ మూవీ బయ్యర్లు నష్టపోయే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 55 నిముషాలకు లాక్ అయింది. అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇంత పెద్ద సినిమాను ప్రేక్షకులకు ఎలాంటి అసహనం కలిగించకుండా దర్శకుడు సుజిత్ నడిపించే తీరుబట్టి ఈ మూవీ బయ్యర్ల అదృష్టం ఆధారపడి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: