మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు సైరా సినిమా. ఈ సినిమాకి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల పూర్తయిన క్రమంలో కొద్ది కొద్ది పనులు మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయిన నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్.అక్టోబర్ 2న సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి తరుణంలో సినిమా ట్రైలర్ ని వీలైనంతవరకూ త్వరగా విడుదల చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయింది.


ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ట్రైలర్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ క్రమంలో ట్రైలర్ నీ వినూత్నంగా రిలీజ్ చేయటానికి నిర్మాత రామ్ చరణ్ సరికొత్త నిర్ణయాలు తిసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినపడుతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ద్వారా రిలీజ్ చేయించాలని ప్లాన్ చేసుకున్న చరణ్ తమిళ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ ద్వారా రిలీజ్ చేయించేందుకు రెడీ అవుతున్నారు.


తమిళంలో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ రావాలంటే ఖచ్చితంగా రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి రజినీకాంత్ ని రిక్వెస్ట్ చేయడానికి చెర్రీ సిద్ధమైనట్లు సమాచారం. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో విడుదల అవుతున్న సందర్భాల్లో చాలా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొన్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ చనువుతో రామ్ చరణ్ సైరా సినిమా ప్రమోషన్ తమిళ్ లో రజినీకాంత్ పాల్గొనేలా చేయడం కోసం తన వంతు ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: