మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా చేసిన అతని ఆక్టివ్ నెస్ తో సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటాడు. అలాంటి మాస మహారాజ్ రవి తేజ శర్వానంద్ కోసం రణరంగం సినిమాను వదిలేసుకున్నారట. రవి తేజను ఉహించుకొని కథ రాస్తే అది చివరకు శర్వానంద్ కు చేరింది అని దర్శకుడు నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.                                 


అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రణరంగం సినిమా శర్వానంద్ చేశారు. అయితే రవి తేజ కూడా డిస్కో రాజా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రవి తేజ ఒక కొత్త సినిమా చెయ్యనున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు రవి తేజ కాగా రాశీఖన్నా కథానాయక అనే టాక్ వినిపిస్తుంది.                                             


వివరాల ప్రకారం రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయిట. అందులో భాగంగా రాశీఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారట. మొదట ఈ చిత్రంలో అదితిరావు హైదరి నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల  ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నారట. దీంతో అదితి స్థానంలో రాశీఖన్నాను హీరోయిన్‌గా యూనిట్ ఎంపిక చేసుకుందట. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఈ జంట మూడోసారి తెరపై కనువిందు చేస్తుంది.                                                     


మరింత సమాచారం తెలుసుకోండి: