యాంక‌ర్ అన‌సూయ‌. ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. బుల్లితెర మీద‌ గ్లామ‌ర‌స్‌గా ఉండే త‌క్కువ మందిలో అన‌సూయ‌ కూడా ఒక‌రు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌సూయ జాబ‌ర్ధ‌స్త్ ప్రోగ్రామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల్లో ఏ మాత్రం తీసిపోలేదు. క్షణం, రంగస్థలం, ఎఫ్ 2 లాంటి ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పింది. నిజానికి రంగ‌స్థ‌లం సినిమాలో రంగమ్మత్త‌గా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. 


ఈ సినిమాతో ఈ అమ్మ‌డు జాత‌కం మారిపోయింది. తాజాగా 'కథనం' చిత్రంలో నటించి యాంక‌ర్‌గా ట‌ర్న్ తీసుకుని మ‌రో సారి త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే అన‌సూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ కొత్త‌ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనను టార్గెట్ చేస్తూ ఎన్ని ట్రోలింగ్స్ చేసినా డోన్ట్ కేర్ అంటోంది. 


తాజాగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్ తన ఇష్టం అని అంటోంది. నిజానికి నాలా మోడరన్‌గా వేరే భాషవాళ్లు చేస్తే వహ్ వా అంటారు. వేరు భాషనుండి వచ్చిన వాళ్లను సొంగ కార్చుకుంటూ చూస్తారు. అదే తెలుగు వాళ్లైతే ట్రోలింగ్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మ‌రియు త‌న యంక‌రింగ్ విష‌యంపై కూడా స్పందించిన అన‌సూయ.. సుమ, నేను, ఝాన్సీ అందరం పెళ్లైన వాళ్ళమే. కానీ త‌మ‌కు కంఫ‌ర్ట్‌ ఉండే విధంగా న‌చ్చిన‌ట్ట యాంక‌రింగ్ చేసుకుంటాం. 


అయితే మేం అంద‌రం ఒకే వృత్తిలో ఉన్నా నాకు వాళ్ల‌క‌న్నా అనుభవం త‌క్కువే. మ‌రియు సుమ‌ను చూపి నేర్చుకో అని చాలా మంది అంటున్నారు.. అయితే సుమ‌గారినే కాలాన్ని బ‌ట్టి ఎలా ఉండాలో న‌న్ను చూసి నేర్చుకోవ‌చ్చుగా అని  ట్రోల్ చేసే వాళ్లకు కౌంటర్ ఇచ్చింది. ఎవ‌రు ఎవ‌రికి స‌ల‌హాలు ఇవ్వాల్సిన అవ‌సరం లేదంటూ త‌మ వ్యక్తిగత విషయాలపైన కామెంట్ చేసే వారికి కౌంట‌ర్‌తో స‌మాధానం ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: