టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత గారితో వివాహం తరువాత చాలావరకు సినిమాల పరంగా, అలానే వ్యక్తిత్వం పరంగా ఎంతో మారారు అనే చెప్పాలి. నిజానికి మొదట్లో కొంత రిజర్వుడు గా ఉండే మహేష్ గారు, నమ్రత గారితో వివాహం జరిగి, పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత, తన నడవడికలో ఎంతో మార్పులు తీసుకువచ్చారు. ఇక ఆ తరువాత నుండి అటు అభిమానులతోనూ, ఇటు మీడియా మిత్రులతోనూ ఎప్పుడూ టచ్ లో ఉంటున్న మహేష్, 

ఇటీవల కొన్నేళ్ల క్రితం అభిమానులతో ఎప్పటికపుడు ఇంటరాక్ట్ అవడం కోసం ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖాతాలు కూడా తెరిచారు. అంతేకాక, కొద్దిరోజుల క్రితం అఫీషియల్ గా ఇంస్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేసిన సూపర్ స్టార్, ఎప్పటికపుడు తన సినిమా న్యూస్ తో పాటు, తమ ఫ్యామిలీకి సంబందించిన ముఖ్యమైన విషయాలు అభిమానులతో షేర్ చేస్తున్నారు. ఇకపోతే ఆయన భార్య నమ్రత గారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సూపర్ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇక నేడు అన్నాచెల్లెళ్ళ పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖి పౌర్ణమిని పురస్కరించుకుని వారి బిడ్డలు 

గౌతమ్, సితారలు ఆ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్నారని, అలానే సితార, గౌతమ్ కు రాఖీ కడుతూ ఉన్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆనందంతో షేర్ చేయడం జరిగింది. ఇక ఉదయం నుండి గౌతమ్, సితారల ఆ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తుండగా, పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాటిని లైక్స్ మరియు షేర్ చేస్తూ మరింతగా వైరల్ చేస్తున్నారు. కాగా వారిద్దరి ఫోటోలు నేడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: