మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో నటించి మంచి ఫేమ్ అందుకుంది. ఈ ఏడాది వచ్చిన ఎఫ్ 2 సినిమాలో తమన్నా విక్టరీ వెంకటేస్ సరసన నటించింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల హవా ఎక్కువ అవ్వడంతో స్టార్ హీరోయిన్లు అయిన కాజల్, తమన్నా, రకుల్ వంటి హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే తమన్నా సీనియర్ హీరోయిన్ల చెంత చేరింది. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ మిల్కీ బ్యూటీ తమన్నా అగ్ర హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి.
బాహుబలి వంటి హిట్ సినిమాలో తమన్నా నటనకు మంచి స్పందన వచ్చింది. అయితే అభినేత్రి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సైలెంట్గా ఉంది. తమన్నాకు అవకాశాలు తగ్గినా ఇటు ఐటం సాంగ్స్ విషయంలో మాత్రం ఇరగతీస్తోంది. అయితే తాజాగా ఇమెకు గోపీచంద్ సరసన నటించేందుకు అవకాశం వచ్చింది. అయితే డేట్లు ఖాళీ లేవంటూ రిజక్ట్ చేసింది. నిజానికి తమన్నా సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. దీంతో మంచి రెమ్యూనరేషన్ వస్తుంది.
ఈ క్రమంలోనే తిరిగి మళ్లీ మీడియం హీరోలైన గోపీచంద్ లాంటి వాళ్లతో చేయడంతో రేంజ్ తగ్గిపోతుందని నో చెప్పినట్టు తెలుస్తోంది. మరియు లేడీ ఓడియెంటెడ్, యాక్షన్ సినిమా అవకాశాలు వచ్చినా రిజక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తమన్నా సీనియర్ హీరోలు అయిన చిరంజీవి 'సై రా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈమెకు సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో మీడియం హీరోల సరసన చేయడానికి ఒప్పుకోవడం లేదు. మరియు ఈ బ్యూటీకి రాబోయే రోజుల్లో కూడా సీనియర్ హీరోల చెంత నటించేందుకు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.