ఆగస్టు 30 టాలీవుడ్ ప్రేక్షకుల మాత్రమే కాదు యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న మూవీ.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఐదు సంవత్సరాలు సదీర్ఘంగా షూటింగ్ జరుపుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ మూవీలో బాహుబలి ప్రభాస్ నటన నభూతో..నభవిష్యత్.  ఇప్పటి వరకు తెలుగు తెరపై చూపించని టెక్నాలజీ..జానపద సినిమా ‘బాహుబలి’తో చూపించారు.  అందుకే టాలీవుడ్ లోనే కాదు ఈ మూవీ జాతీయ స్థాయింలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఈ మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాలీవుడ్ లో ఎన్నో ఛాన్సులు వచ్చాయి..కానీ ఈ హీరో మాత్రం తెలుగు సినీ పరిశ్రమనే ముద్దు అంటున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ మూవీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ నెల 30 న ‘సాహూ’ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టీజర్, ట్రైలర్ కి లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో బాగా రెస్పాన్స్ వస్తుంది.  ప్రతిరోజూ ఈ మూవీపై ఎదో ఒక అంచనా పెంచుతూ వస్తున్నారు చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమానుప్రపంచ ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాను ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. గతంలో కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజాగా సాహోకు ఈ ఘనత దక్కింది. ఈ నేపథ్యంలో గ్రాండ్ రెక్స్ థియేటర్‌ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు.శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ఇలా ఎందరో పేరున్న నటీనటులు కనిపించనున్నారు.

సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి 2 తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తమ హీరోని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: