టాలీవుడ్ యువ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇటీవల ఆయన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా యావరేజ్ గా నిలిచి, విజయ్ కు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే గత ఏడాది విజయ్ మరియు రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

మంచి ఎంటర్టైన్మెంట్ తో యూత్ ఫుల్ గా సాగిన గీత గోవిందం సినిమా, యూత్ కి బాగా కనెక్ట్ అవడం, అలానే సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోవడం ఆ సినిమాకు మరింతగా కలిసివచ్చిన అంశంగా చెప్పుకోవాలి. ఇక గత ఏడాది అద్బుతమైన కలెక్షన్స్ సంపాదించిన ఆ సినిమా, ప్రస్తుతం పలు అవార్డులు కూడా దక్కించుకుంటోంది. ఇక ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఎంతో వేడుకగా నిర్వహించిన సైమా 2019 అవార్డుల వేడుకలు, కతర్ లోని దోహా నగరంలో ఎంతో అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక అతిథులుగా టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు సినిమా నటులు ఈ వేడుకలో ఆడిపాడి సందడి చేయడం జరిగింది. గత ఏడాది తెలుగులో రిలీజై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమాలో అద్భుత నటనకు గాను రామ్ చరణ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు, 

మహానటిలో సహజ నటనను కనపరిచినందుకు కీర్తి రెడ్డికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు లభించాయి. ఇక మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకటి కాదు, ఏకంగా రెండు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోవడం ఈ వేడుకలో విశేషంగా చెప్పుకోవాలి. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ మరియు సోషల్ మీడియా లో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ విభాగాల్లో విజయ్ ఈ అవార్డులను కైవశం చేసుకున్నారు. ఇక విజయ్ కి ఒకేసారి రెండు విభాగాల్లో అవార్డులు దక్కడంతో రౌడీ ఫ్యాన్స్ అప్పుడే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ హీరోకు శుభాభినందనలు తెల్పుతూ సందడి చేయడం మొదలెట్టేసారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: