బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ నుండి రోజా తప్పుకున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈటివిలో గ్రాండ్ సక్సెస్ అయిన ఈ షోకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. దాదాపు ఐదారేళ్లుగా ఈ షో చేస్తున్న కమెడియన్స్ అటు స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్ లో అలరిస్తున్నారు.


ఇక జబర్దస్త్ జడ్జులుగా ఉన్న నాగబాబు, రోజాలు కూడా ఈ షో ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. ఏపి ఎలక్షన్స్ వల్ల జబర్దస్త్ షోకి కొంత బ్రేక్ ఇచ్చారు నాగబాబు, రోజా. కాని ఎలక్షన్స్ తర్వాత మళ్లీ షోకి జడ్జులుగా వ్యవహరించారు. నాగబాబు రోజా మిస్సైన టైంలో శేఖర్ మాస్టర్, మీనా, సంఘవి, ఆలి, జానీ మాస్టర్ ఇలా అందరిని జడ్జులుగా తీసుకొచ్చారు.   


ఎలక్షన్స్ ముగిశాయి ఆఫ్టర్ రిజల్ట్స్ కొంత గ్యాప్ తో మళ్లీ నాగబాబు, రోజాలే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జులుగా కనిపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మళ్లీ జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏపిలో వైసిపి అధికార్మలోకి రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేగా రోజా మీద ఎక్కువ బాధ్యత ఉంది.


అంతేకాదు తనకు ఇచ్చిన కొత్త అధికారం కూడా ఆమె పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంది. అందుకే రోజా జబర్దస్త్ కు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ కు మాత్రమే కాదు నాగబాబు, రోజా జడ్జ్ మెంట్ కు ఆడియెన్స్ అలవాటు పడ్డారు. రోజా లేకుండా నాగబాబు.. నాగబాబు లేకుండా రోజా ఈ షోలో ఉన్నా ఏదో అసంతృప్తిగా ఉంటుంది. రోజా మిస్సైన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో నాగబాబు పక్కన శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వచ్చారు. మరి రోజా పూర్తిగా జబర్దస్త్ నుండి తప్పుకున్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: