అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రేజీ మూవీస్ లో ఒకటైన సాహో పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల తో పాటుగా సినీ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలున్నాయి. శర్వానంద్ హీరోగా గతంలో రాన్ రాజా రన్ అనే చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తుండగా, జీబ్రాన్ నేపధ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే, ఇది ఖచ్చితంగా ఇండియా సినిమా కాదు, హాలీవుడ్ రేంజ్ సినిమానే అని పలువురు కితాబిస్తున్నారు. 

ఇకపోతే తమ సినిమాపై ఉన్న నమ్మకాన్ని ఇప్పటికే దర్శకుడు సుజీత్ మీడియాతో మాట్లాడుతూ వ్యక్తం చేసారు. దాదాపుగా రెండేళ్ల పడ్డ శ్రమ, అలానే యూనిట్ సభ్యులు అందరూ కూడా రేయింబవళ్లు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటాం అనే నమ్మకంతో ఉన్నామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక బాహుబలి కంటే ముందే ఈ కథ ప్రభాస్ అన్నకు చెప్పానని, కథ విని ఎంతో థ్రిల్ ఫీల్ అయిన ప్రభాస్ అన్న, తనపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారని, ఆయన నమ్మకాన్ని సాహో తప్పకుండా నిలబెడుతుందని సుజీత్ ఆశాభావము వ్యక్తం చేయడం జరిగింది. ఇక ప్రభాస్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తమ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరియు థ్రిల్ల్లింగ్ కి గురిచేసే కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్ లు, సినిమాకు ఎంతో ప్రాణంగా నిలుస్తాయని, అవే తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమాకు మంచి విజయాన్ని కట్టబెడతాయని నమ్మకంగా చెప్పారు. 

ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే తప్పకుండా ఇది ఇండియాలోనే ఇప్పటివరకు రాని యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ అంటరాని, కాబట్టే సినిమా ప్రమోషన్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ట్యాగ్ పెట్టడం జరిగిందని కూడా ఆయన అన్నారు. మరి ప్రభాస్ సహా, యూనిట్ మొత్తం సక్సెస్ పై ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్న సాహో సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి...!!    


మరింత సమాచారం తెలుసుకోండి: