టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ "చి.ల.సౌ" సినిమా ఫేమ్  రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం 'మన్మథుడు 2'. రిలీజ్ ముందు నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చినంత బజ్ ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఇందులో నాగార్జున లుక్‌కు మాత్రం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. పూర్తి ఫారెన్ బ్యాగ్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఎక్కువైందన్న టాక్ వినిపించింది. అందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదు.


ఇదిలాఉండగా, స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగను పురస్కరించుకుని నాగార్జున ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 'మన్మథుడు 2' చిత్ర విశేషాలతో పాటు, హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ గురించి కూడా  ఎన్నో అంశాలను వాళ్లతో పంచుకున్నాడు నాగ్. ఈ సమయంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.


ఓ అమ్మాయి మాట్లాడుతూ.. 'మీ ఇంట్లో ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు' అని అడిగింది. దీనికి సమాధానం చెబుతూ 'మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. అఖిల్ ఆట పాటలతో ఎంటర్‌టైన్ చేస్తాడు. సమంత మాత్రం అందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలా అల్లరి చేస్తుంది. ఆమె అల్లరి తట్టుకోవడం మా వల్ల కాదు' కోడలి గురించి  అని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: