అడవి శేష్.. తెలుగులో వైవిధ్యం కోసం తపన పడే కుర్ర హీరోల్లో ఒకడు. తన పాత సినిమాల సంగతి ఎలా ఉన్నా.. గూఢచారి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఆ సినిమా సూపర్ హిట్ కాకపోయినా అడవి శేష్ కు మంచి పేరు తెచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ జోనర్ లో మంచి మూవీగా క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు.


గూఢచారి స్ఫూర్తితో మరో ముందడుగు వేసిన అడవి శేష్.. ఎవరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఓ రీమేక్ మూవీని అంతే స్టైలిష్ గా, గ్రిప్పింగ్ గా తీసి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఎవరు యూనిట్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అడవి శేష్ ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటపెట్టారు.


ఎవడు సినిమాకూ ఎవరు సినిమాకు ఉన్న లింకును ఆయన తన మాట్లలోనే చెప్పారు.. ‘‘దిల్‌ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాకీ, ఈ ‘ఎవరు’కి ఒక లింక్‌ ఉంది. ‘ఎవడు’లో నేను ప్రతినాయకుడిగా నటించాలని ప్రయత్నించా. కానీ కుదరలేదు. అప్పుడు నేనా స్థాయికి ఎదగలేదు కూడా. ‘ఎవరు’ చూశాక దిల్‌రాజు ఫోన్‌ చేసి ‘నా సంస్థలో సినిమా ఎప్పుడు చేద్దాం’ అని అడిగారు. అది నాకు బాగా సంతోషాన్నిచ్చిన విషయం. ‘గూఢచారి’ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లతో ఈ సినిమా ప్రారంభమైంది’’ అన్నారు.


ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ... ‘మన దగ్గర ప్రతిభ ఉంటే ఏదైనా చేసి అనుకొన్నది సాధించొచ్చని ఈ తరానికి చెప్పిన నటుడు శేష్‌. నటుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు. తను చేసిన ‘ఎవరు’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇన్ని మలుపులతో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసిన ఇలాంటి సినిమా ఈమధ్య కాలంలో రాలేదు. మేం నైజాంలో విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో సినిమా చేయమని శేష్‌ని ఆహ్వానిస్తున్నా. ఇలాంటి కాన్సెప్టులతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: