శర్వానంద్ నటించిన రణరంగం, అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎవరు చిత్రాలు స్వాతంత్య్ర‌ దినోత్సవం కానుకగా ఈనెల 15న విడుదలైన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా, రణరంగంకు మిక్స్‌డ్ టాక్‌ లభించింది. భారత దేశ చిత్రాలకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన యూఎస్‌లో ఈ రెండు సినిమాల పెర్పామెన్స్ ఎలా ఉందో చూద్దాం.


ఎవ‌రు సినిమా విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ రిలీజ్ కావ‌డానికి ఒక రోజు ముందే బుధ‌వార‌మే ఈ సినిమాకు అక్క‌డ ప్రీమియ‌ర్లు వేశారు. ప్రీమియర్స్ ద్వారా $ 61,499 గ్రాస్ వసూళ్లు సాధించి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఈ వ‌సూళ్లు అడ‌వి శేష్ కెరీర్‌లో బెస్ట్ వ‌సూళ్లుగా నిలిచాయి. ఇక గురువారం తొలి రోజు ఎవ‌రు $ 43,320 గ్రాస్ సాధించిందని సమాచారం. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎవరు చిత్రం యూఎస్ లో $ 1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు స‌మాచారం.


ఇక శ‌ర్వానంద్ ర‌ణంరంగం విష‌యానికి వ‌స్తే యూఎస్‌లో అనుకున్న రేంజ్‌లో ఈ సినిమాకు వ‌సూళ్లు రాలేదు. ఎవ‌రుతో పోలిస్తే ర‌ణ‌రంగం నిరాశ‌ప‌రిచిన‌ట్టే అనుకోవాలి. యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం ఈ మూవీ వసూళ్లపై తీవ్రప్రభావం చూపింది. గురువారం ఈ మూవీ $ 24,014 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ర‌ణ‌రంగంకు ఓవ‌రాల్‌గా కేవలం $ 27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వ‌చ్చాయి.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మం ర‌ణ‌రంగం పైచేసి సాధించింది. తొలి రోజు ర‌ణ‌రంగంకు రూ 3.8 కోట్ల షేర్ వ‌స్తే.. అటు ఎవ‌రు మూవీకి 1.6 కోట్ల షేర్ వ‌చ్చింది. మ‌రి నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఈ రెండు సినిమాల్లో ఏది క‌లెక్ష‌న్ల‌లో పైచేయి సాధిస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: