ఈ మద్య సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ ని ఎక్కువగా సోషల్ మాద్యమాలతోనే పలకరిస్తున్నారు.  ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ స్ట్రా గామ్ ఇలా పలు రకాల సోషల్ మాద్యమాల ద్వార తమ అనుభవాలు, ఫోటోలు, మెసేజ్ లు షేర్ చేస్తున్నారు.  కొన్ని సార్లువారు షేర్ చేస్తున్న విషయాలు, ఫోటోలు ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతున్న విషయం తెలిసిందే.  తెలిసి చేసినా..తెలియక చేసిన సెలబ్రెటీలు కావడంతో వారిపై రకరకాలుగా ట్రోలింగ్స్ రావడం కామన్ అయ్యింది.  తాజాగా ఓ హీరోయిన్ చేసిన పనికి ఆమెపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి..అంతే కాదు బండ బూతులు తిడుతున్నారు. 

అసలు విషయానికి వస్తే..సెక్సీ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ల మనసు దోచేస్తున్న బ్యూటీ ఈషా గుప్త.  ఈమె స్వాతంత్ర దినోత్సవం రోజున చేదు అనుభవం ఎదురైంది. తన ట్విట్టర్ ఖాతాని కొందరు హ్యాక్ చేశారని ఈషా గుప్తా ప్రకటించింది.  ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ నుంచి ‘అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు' అనే పోస్ట్ అయింది. ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే అనుకుంటోందని కనీసం ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే కి తేడా తెలియని నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావని బండ బూతులు తిడుతున్నారు.

తనపై ట్రోలింగ్ ఎక్కువవుతుండడంతో ఈషా గుప్తా స్పందించింది.  బాబోయ్ నేను ఆ ట్విట్ చేయలేదు..నాకు ఆ మాత్రం తేడా తెలియదా..ట్వీట్ తాను చేయలేదని, తన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైందని వివరణ ఇచ్చింది. వెంటనే ఆ ట్విట్ ని తొలగించింది ఈ అందాల భామ. తాను ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి కుమార్తెని అని, ఏ పండుగ ఎప్పుడో తనకు తెలుసు అని క్లారిటీ ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: