అడల్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వివిధ రంగాలలో సెటిల్ కావాలని చూస్తున్నారు. అడల్ట్ సినిమా ఇండస్ట్రీని చూసి చాలామంది ఎట్రాక్ట్ అవుతుంటారు. అందులో కోట్లు సంపాదించవచ్చని ఫీల్ అవుతుంటారు. ఆ సినిమాల్లో ఎంత సంపాదించినా.. మిగిలేది కొద్దిగే అని ఎంతోమంది చెప్పకనే చెప్పారు.
ఇలా ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి సినిమా రంగంలో సెటిలైన హీరోయిన్ సన్నీలియోన్. ఈమె ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో కూడా సినిమా చేస్తూ బిజీ అయ్యింది. సొంతంగా వ్యాపారులు చేస్తోంది. ఇలా అనేక సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. సన్నీ లియోన్ స్పూర్తితో ఇప్పుడు మరో నటి బయటకు వచ్చింది. ఆమె మియా ఖలీఫా. తన కెరీర్లో కేవలం ఆమె సంపాదించింది 12 వేల డాలర్లు మాత్రమే అంట.
అయితే తనకు హిజాబ్ ధరించి చేసిన అడల్ట్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు ఐసిస్ ఉగ్రవాదుల నుంచి వార్నింగ్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని మియా పేర్కొన్నది. అడల్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. ఈ ఇండస్ట్రీ నుంచి బయటపడి..ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటోంది.
కానీ, ఆమెకు ఉద్యోగం దొరకడం లేదట. ఎక్కడికి వెళ్లినా ఆమెను మరోలా చూస్తున్నారని వాపోతున్నది. ప్రస్తుతం ఆమె ఓ స్పోర్ట్స్ ప్రజెంటర్ పనిచేస్తున్నది. తన సోషల్ మీడియా యాప్ ఇంస్టాగ్రామ్ ను ఐసిస్ హ్యాక్ చేసిందని, తన అభిమానులతో తాను మాట్లాడేందుకు వీలు లేకుండా పోయిందని వాపోతున్నది మియా ఖలీఫా. నిజమే కదా ఒక్కసారి ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత బయటపడటం అంటే మామూలు విషయం కాదు. తెగింపు ఉండాలి. బ్రతక గలగమనే నమ్మకం ఉండాలి. అందరికి సన్నీలియోన్ అంతటి ధైర్యం ఉండదు కదా మరి.