సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరక్షన్ లో నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ నవంబర్ కు దాదాపు కంప్లీట్ అయిపోతుందని తాజా సమాచారం. ఆ తర్వాత సూపర్ స్టార్ ఫ్రీ అయిపోతున్నారు. మరి తర్వాత ఏ సినిమా చేయాలి? అనేదే ఇప్పుడు మహేష్ ఆలోచన. వంశీ పైడిపల్లి సినిమానే అని ముందు నుంచి అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా మార్చి నాటికి వంశీ పైడిపల్లి కథతో రెడీ అయిపోతారు అనే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే మహర్షి తో మహేష్ తో వంశీ మంచి హిట్టిచాడు కాబట్టి.

కానీ డైరక్టర్ పరుశురామ్ చెప్పిన పాయింట్ నచ్చడం, అయినా చేయలేనని మహేష్ అనడం ఈలోగా జరిగాయి. ఇందుకు సంబంధించిన గాసిప్ లు వినిపించాయి. అయినా పరుశురామ్ పట్టు వదలకుండా భీమిలిలో తన అసిస్టెంట్ లతో కూర్చుని, ఫుల్ స్క్రిప్ట్ తయారుచేసే పనిలో బిజీగా వున్నారు. ఫుల్ స్క్రిప్ట్ చూపించి, అయిదు నెలల్లో సినిమా తీసి ఇస్తాననే మాటతో మహేష్ ను ఒప్పించాలని పట్టుదలగా ఉన్నాడట. ఎందుకంటే పరుశురామ్ ఈ సంవత్సరం ఎలాగైనా మహేష్ బాబు తో సినిమా చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడని అందరికి తెలిసిందే.

కొరటాల శివ, మైత్రీ మూవీస్, కొరటాల స్నేహితులు ఈ ప్రాజెక్టు వెనుక వుండడంతో పరుశురామ్ ధైర్యంగా ఉన్నాడని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తూండడం అన్న పాయింట్ పరుశురామ్ కు ప్లస్ అనిపిస్తోంది. ఇదే వంశీ పైడిపల్లి కి పెద్ద మైనస్ అని తెలుస్తోంది. అందుకు కారణం ఇప్పటివరకు మహేష్ కి వంశీ కనీసం లైన్ కూడా చెప్పకపోవడం.
అయితే ఇచ్చిన మాట కోసం లేటయినా వంశీ కోసం వెయిట్ చేద్దామా? లేదా స్క్రిప్ట్ రెడీ అయితే పరుశురామ్ తో సెట్స్ కు వెళ్లిపోదామా? అన్న డైలమాలో మహేష్ ఉన్నాడట. అందుకే ఈ విషయంలో దర్శకుడు కొరటాల వైపు నుంచి మహేష్ మీద కాస్త గట్టి వత్తిడి చేస్తున్నట్లు కూడా ఫిలిం నగర్ లో  చెప్పుకుంటున్నట్లు లేటెస్ట్ న్యూస్. 



మరింత సమాచారం తెలుసుకోండి: