ఛలో.. గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడమే కాదు లక్కీ హీరోయిన్ గా హీరోలందరు తనే కావాలనే విధంగా పాపులరయింది రష్మిక మందన్న. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ భిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు.. నితిన్ తో భీష్మ.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించనున్నసినిమాలో రష్మిక నటిస్తోంది. వీటితో పాటు మొదటిసారి కార్తి సరసన నటిస్తున్న సినిమాతో తమిళంలోను అడుగుపెట్టబోతోంది.

రోమియో ఫేమ్ భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు తెలుగులో సరిలేరు నీకెవ్వరు.. భీష్మ సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ.. తమిళ సినిమాకు డేట్లు సర్దుబాటు చేసింది. ఖాకీ తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయలేదు. అయితే యూనిట్ కి తెలియకుండా రష్మిక ఈ సినిమా టైటిల్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసింది.

లేటెస్ట్ గా ఆన్ లొకేషన్ లో ఉన్న రష్మిక సుల్తాన్ షూటింగ్ లో ఇది నాలుగవ రోజు అంటూ టైటిల్ ని రివీల్ చేయడం విశేషం. యు డోంట్ గెట్ టు సీ ద లుక్ యో అని ఆన్ లొకేషన్ పిక్ ని పోస్ట్ చేసి సినిమా టైటిల్ ని తనకు తెలియకుండా తానే బయటపెట్టేసింది. టైటిల్ తెలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ టైటిల్ నే కార్తీ ఫ్యాన్స్ వైరల్ చేయడంతో ఈ విషయం చిత్రయూనిట్ కి తెలిసిపోయిందట. మరి అధికారికంగా టైటిల్ ని ప్రకటించకుండానే లీక్ చేసేసిన రష్మికపై చిత్రయూనిట్ ఎలాంటి చర్యలు తీసుకోనుందోనని రష్మిక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: