సూపర్ స్టార్ మహేష్ ఈమధ్య కొంచం రూటు మార్చాడు అనే చెప్పాలి. కొద్ది రోజులు వరుసగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు తీసిన మహేష్ ఎప్పుడు టాలెంట్ ఉన్న యువ దర్శకులను సైతం ప్రోత్సహిస్తున్నాడు. మొన్న వంశీ పైడిపల్లి తో సినిమా అయిన వెంటనే అనిల్ రావిపూడి తో సినిమా షురూ చేసేసాడు. తన తదుపరి చిత్రాలు కూడా కొత్త డైరెక్టర్లు తోనే చేద్దామని నిర్ణయించుకున్నా విషయం తెలిసిందే. ఈ లిస్టులో లో పరశురామ్, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా. అయితే అనిల్ తో సినిమా తర్వాత బాబు ఎవరితో చేస్తారు అన్న విషయం అందరికీ సస్పెన్స్ గా ఉన్నది.

మహేష్ తన తరువాత చిత్రం పరశురామ్ తో తీస్తున్నట్లు సమాచారం. గీత గోవిందం తో అతి పెద్ద బ్లాక్బస్టర్ కొట్టిన పరశురామ్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో దిట్ట. అయితే ఇప్పటివరకు యంగ్ డైరెక్టర్లను మాత్రమే డైరెక్ట్ చేసిన పరశురామ్ మహేష్ లాంటి పెద్ద హీరోతో ఎలా చేస్తాడో వేచి చూడాలి. ఇప్పటికే రెండు సార్లు మహేష్ ని కలిసిన పరుశురామ్ త్వరలోనే ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడట. మహేష్ కి కథ చాలా నచ్చడంతో ఫైనల్ నరేషన్ కి ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నాడు. 

ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ లో బిజీగా ఉన్న బాబు ఎలాగైనా నాన్ బాహుబలి కొట్టాలని కసిమీద ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏడేకల్లో జరుగుతుంది. కశ్మీర్ లో సెటిల్ పూర్తి చేసుకున్న బృందం బాబు లేకుండా కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అక్కడ పని ముగించాక మహేష్బాబు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో లో కొన్ని కీలక సన్నివేశాల్లో పాల్గొంటారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అంటే ఈ ఏడాది చివర్లో మహేష్-పరశురామ్ సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: