టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ఫుల్ స్వింగ్ లో పరిగెత్తిస్తున్న సాహో యూనిట్, రేపు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే ప్రి రిలీజ్ ఈవెంట్ ని అత్యంత భారీగా నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఇక ఈ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే సాహో మూవీ యూనిట్ తో పాటు వేలాదిగా అభిమానులు పాల్గొననున్న ఈ ఈవెంట్ లో ఒక బిగ్ సర్ప్రైజ్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అదేమిటంటే, టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరవబోతున్నట్లు ఒక వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 

నిజానికి ఈ ఈవెంట్ కోసం ఆ హీరోని రెండు రోజుల క్రితమే సాహో యూనిట్ కలిసి ఆహ్వానించడం జరిగిందని, అయితే ఆ విషయాన్ని మాత్రం బయటకు రాకుండా ఒకేసారి ఈవెంట్ లో రివీల్ చేసి ఫ్యాన్స్ ని సప్రైజ్ చేద్దాం అని అనుకున్నారట. అయితే అనుకోకుండా ఈ విషయం బయటకు రావడంతో, నేడు ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ అదే నిజం అయితే మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఖుషి అవడం ఖాయమనే చెప్పాలి....!


మరింత సమాచారం తెలుసుకోండి: