తాజాగా ఇటీవల శనివారం జరిగిన ఎపిసోడ్ తో నాలుగు వారాలు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి అనేక ముచ్చట్లు చూపించగా బాబా భాస్కర్ మాస్టర్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సాంగ్ కి హౌస్ లో ఉన్న నలుగురు అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆనందపరిచారు. ఈ క్రమంలో మహేష్ తన ముఖానికి నల్లటి క్రీమ్ ఒకటి పూసుకొని రాగా ...బాబా భాస్కర్ వెంటనే ఏంట్రా ముఖానికి పాముకొన్నావ్ అంటూ మహేష్ ని ఆట పట్టించాడు. దీంతో కంటెస్టెంట్ మహేష్ వెంటనే స్పందిస్తూ..నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి ఈ క్రీము రాసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


ఇటువంటి క్రమంలో భాస్కర్ నేను ఎనిమిదవ తరగతి చదివే నువ్వు ఏం చదివావు అంటూ మహేష్ ని ప్రశ్నించిన నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానని బాబా భాస్కర్ కి ఆన్సర్ ఇచ్చాడు మహేష్. దీంతో అంతా చదువుకొని ఎక్కడ ఎందుకు వచ్చావు ..? అయితే నువ్వు అంత చదివితే బిగ్ బాస్ అడిగిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వలేక పోయావు అంటూ మహేష్ పై బాబా భాస్కర్ మాస్టర్ పంచ్ వేశారు.


ఈ క్రమంలో హాల్ లో సోఫాలో రాహుల్, పునర్నవి లు రొమాంటిక్ ముచ్చట్లు పెట్టారు. సడెన్ గా రాహుల్ లేచి.. మనం ఇలా పడుకొని ఉంటే మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకుని ఉంటే నువ్వే పిలిచావ్ అంటూ ఫైర్ అయింది పునర్నవి. ఇది ఇలా ఉండగా.. కిచెన్ లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికాకు సర్ధి చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో ఈవారం సేఫ్ అయిన వారిలో శివ జ్యోతి, వరుణ్ లు పేర్లు నాగార్జున ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: