బిగ్ బాస్ ని నాగార్జున ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నప్పటికీ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున మూడు పొరపాట్లని చేసాడు. కంటెస్టెంట్స్ తప్పులని ఎత్తి చూపడంలో అందరినీ సమానంగా చూడలేదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న కంటెస్టెంట్స్ అందరికీ అవార్డుల ప్రధానం జరిగింది. అవార్డు ఇస్తూ దానికి గల కారణాన్ని వివరించాడు. అయితే పునర్నవికి ఎంపైర్ అవార్డు దక్కింది. 


ఆమె ఏ టాస్క్ లోనూ పార్టిసిపేట్ చేయకుండా పక్కన కూర్చుని అందరినీ జడ్జ్ చేస్తూ అంపైర్ లాగా ప్రవర్తిస్తుందని అన్నాడు. అయితే ఇక్కడ నాగార్జున ఒక విషయం మర్చిపోయాడు. పునర్నవి చాలా సార్లు తన లూజ్ టంగ్ తో కంటెస్టెంట్ పై నోరు పారేసుకుంది. చాలా రోజులుగా పునర్నవి తీరు ఇలానే ఉంది. అయితే ఈ విషయాన్ని నాగార్జున ఎత్తి చూపలేదు. మొన్న మహేష్ విట్ట విషయంలో కూడా పని పాట లేని వాడంటూ మాట్లాడింది. అయితే నాగార్జున ఇవేమీ చర్చించలేదు.


ఇక రెండోది మహేష్ విట్ట విషయంలో జరిగింది. మహేష్ విట్టకి మ్యాచ్ బాక్స్  అవార్డు ఇస్తూ దానికి బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ అని ఏదో కారణం చెప్పాడు. కాకపోతే ఆ విషయాన్ని ఇంకా క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇక మూడోది, రాహుల్ విషయంలో వీడియో బైట్  ప్లే చేసి అతని తప్పులని ఏ విధంగా ఎత్తి చూపాడో అందరి విషయంలో అలా చేయకపోవడం.


కంటెస్టెంట్స్ అందరి విషయంలో అలా చేసి ఉంటే వాళ్ళ తప్పులని ఇంకా బాగా అర్థం చేసుకునేవారు. అదీగాక చూసే ప్రేక్షకులకి కూడా మరింత మజా వచ్చేది. ఈ విధంగా ఈ ఎపిసోడ్ లో నాగార్జున మూడు పొరపాట్లు చేసాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: