జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో అవార్డ్ ఇచ్చాడు. ఈ వారం ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కు నామినేట్ కాగా నాగార్జున ఇద్దరినీ సేఫ్ చేసాడు. మొదట శివజ్యోతిని సేఫ్ చేసిన నాగార్జున ఆ తరువాత వరుణ్ సందేశ్ ను సేఫ్ చేసాడు. ఇద్దరు సేఫ్ కావటంతో ఐదుగురు ఇంటి సభ్యులు బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి ఈ ఐదుగురిలో ఈరోజు ఎవరో ఒకరు ఈ షో నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. 
 
ఈ ఐదుగురిలో బాబా భాస్కర్ పట్ల ప్రేక్షకులలో సానుకూలత ఎక్కువగా ఉండటంతో బాబా భాస్కర్ కు ఓట్లు ఎక్కువగా వచ్చాయని తెలుస్తోంది. శ్రీముఖికి యాంకర్ గా ఉన్న ఇమేజ్ తో పాటు సోషల్ మీడియాలో శ్రీముఖి ఫ్యాన్స్ ఆర్మీలుగా ఏర్పడి శ్రీముఖిని సేఫ్ అయ్యేలా చేస్తున్నారు. సీరియల్ నటుడు రవికృష్ణ బిగ్ బాస్ హౌస్లో కాంట్రవర్సీలకు దూరంగా ఉండటంతో రవికృష్ణకు కూడా ఓట్లు బాగానే వచ్చినట్లు సమాచారం. 
 
రాహుల్ సిప్లిగంజ్, రోహిణి ఇద్దరికీ ఈ వారం ఓట్లు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం రోహిణి ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. రోహిణి బిగ్ బాస్ హౌస్లో కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో పెద్దగా ఇమేజ్ లేకపోవటంతో ఓట్లు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రోహిణి మొదట ఎలిమినేషన్ కు నామినేట్ కాలేదు. 
 
కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చాక శివజ్యోతి, రోహిణి నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించారు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వెళ్ళాక నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించవద్దని చెప్పినప్పటికీ రోహిణి నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించటంతో బిగ్ బాస్ రోహిణిని నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ చేసాడు. నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించకుండా ఉండి ఉంటే మాత్రం రోహిణి కాకుండా మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: