మహర్షి తరువాత  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం  'సరిలేరునికెవ్వరు'.  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా  జరుగుతుంది.  ఈషెడ్యూల్ లో ఇప్పటికే  ట్రైన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.  ఈ లాంగ్  ఎపిసోడ్  హిలేరియస్ గా ఉండి  సినిమాలో హైలైట్ కానుందట.  కాగా సుమారు 13 సంవత్సరాల తరువాత మళ్ళీ విజయశాంతి ఈసినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఇక  ఈ చిత్రం లో విజయశాంతి ప్రొఫెసర్  పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈసినిమాలో  ఆమె పాత్ర ఫై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో విజయశాంతి  మెడికల్ ప్రొఫెసర్ గా కనిపించనుందట.  అందుకు తగ్గట్లు ఆమె లుక్ ను కూడా మార్చుకుంది.


సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న  ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఇక వీరితో పాటు బండ్ల గణేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.   రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ల ఫై అనిల్ సుంకర , దిల్ రాజు  నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం  వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.    


ఇక ఇప్పటివరకు  కెరీర్ లో అపజయమే లేకుండా  దూసుకుపోతున్నాడు  అనిల్ రావిపూడి. ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీయగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ సరిలేరు నీకెవ్వరుతో కూడా సూపర్ హిట్ కొట్టి  అనిల్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: