టాలీవుడ్ దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో పలు భాషల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాపై, దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే మరోవైపు ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి రెండు భాగాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ హీరోగా సాహో సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. 

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్, సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచాయి. ఇక నేడు ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని రామోజీ ఫీల్ సిటీలో అట్టహాసంగా జరుగనుంది. ఇకపొతే ఈ సినిమాకు సంబందించిన ఒక వార్త, నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది, అదేమిటంటే, రెండు రోజుల క్రితం సాహో సినిమాను స్పెషల్ గా రాజమౌళి కోసం రికార్డింగ్ జరుగుతున్న సమయంలో వేసి చూపించడం జరిగిందని, అయితే సినిమాను ఆ విధంగా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా వేసి చూపించడానికి ఒక కారణం ఉందట, సినిమా చూసాక ఏవైనా సన్నివేశాల్లో లోపాలుంటే వాటిని రాజమౌళి చెప్తారు అనే ఉద్దేశ్యంతోనే వారికి స్పెషల్ గా వేసి చూపించడం జరిగిందట. ఇక సినిమాను వీక్షించ రాజమౌళి, దర్శకుడు సుజీత్ పై ప్రశంశలు కురిపించారని, 

అయితే సినిమాలో అక్కడక్కడా ఒకటి రెండు చిన్న సర్దుబాట్లు మాత్రం ఆయన చెప్పడం జరిగిందని గుస గుసలు వినిపిస్తున్నాయి. నిజానికి సాహోను రాజమౌళి కోసం ప్రత్యేకంగా వేసిన ప్రదర్శన విషయమై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ నిజంగా రాజమౌళి ఈ సినిమా చూసి, అందులో లోటు పట్లు సరిచేయమని సలహా ఇచ్చిన మాట వాస్తవం కనుక అయితే, సాహో షూర్ షాట్ గా హిట్ ని అందుకున్నట్లే  అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే సాహో యూనిట్ స్పందించాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: