ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అవుతున్న షోల్లో మంచి రేటింగ్స్ మరియు క్రేజ్ తో సాగుతున్న షో జబర్దస్త్. ఎందరో నూతన నటులను బుల్లితెరకు, ఆపై సినిమా తెరకు పరిచయం చేసిన ఈ ప్రోగ్రాం వీడియోలకు, యూట్యూబ్ లో కూడా లక్షలాదిగా లైక్స్ వస్తుంటాయంటే, మనవాళ్లకు జబర్దస్త్ ఎంతలా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రతి వారం మంచి ఎంటర్టైన్మెంట్ మరియు జోష్ తో సాగే ఈ షో, పండుగల సమయంలో మాత్రం మరింత వినూత్నంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. గతంలోని దసరా, దీపావళి పండుగల సమయంలో సరైనోళ్ళు, తారాజువ్వలు పేరుతో ఆయా పండుగ దినాల్లో ఎంతో సందడిచేసిన ఈ షోలోని పార్టిసిపెంట్స్, 

త్వరలో రాబోతున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మరొక వినూత్నమైన ఆలోచనతో రాబోతున్నారు. ఇక ఆ పండుగ స్పెషల్ షో ప్రోమో ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సందడి చేస్తోంది. నిజానికి ఈ ప్రోమోలో జడ్జీలు నాగబాబు మరియు రోజలు ఇద్దరూ కూడా నా నవ్వు బాగుంటుంది అంటే, నా నవ్వు బాగుంటుంది అంటూ గొడవపడటం, మధ్యలో యాంకర్ ప్రదీప్ వచ్చి వారిని వారించడం మనం గమనించవచ్చు. ఇక వారి గొడవ చూసిన ప్రేక్షకులు, వీళ్ళు నిజంగానే గొడవపడుతున్నారు అనుకుని నోరెళ్లబెడుతున్నారు. అయితే ప్రోమో చివరిలో అది కేవలం సరదా కోసం సాగె వివాదం అని మనకు అర్ధం అవుతుంది. అందుకే వినాయక చవితి స్పెషల్ గా రాబోతున్న ఈ షోకు 'ఔను వాళ్లిద్దరూ గొడవపడ్డారు' అనే వెరైటీ టైటిల్ ని నిర్ణయించి, 

ప్రేక్షకుల్ని కొంత థ్రిల్ చేయడం కోసం నాగబాబు, రోజాలతో ఆ విధంగా ప్రోమోని డిజైన్ చేయించడం జరిగిందట. ప్రతి వారం ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేసే జబర్దస్త్ షోలోని పార్టిసిపెంట్స్ అందరూ కలిసి ఈ స్పెషల్ ప్రోగ్రాం లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న ఈ షో, పండుగల సమయంలో ఈ విధంగా ప్రత్యేకంగా ముస్తాబై వారిని మరింతగా రంజింపచేయడంతో, జబర్దస్త్ కు రాబోయే రోజుల్లో మరింతగా ప్రేక్షకాధారణ పెరుగుతుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: