యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన  లేటెస్ట్ మూవీ  'డియర్ కామ్రేడ్' ఇటీవల విడుదలై  బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా  బోల్తాపడింది.  నెగిటివ్ మౌత్ టాక్ తో ఈ చిత్రం  ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేక డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరిపోయింది.  దాంతో  గీత గోవిందం , టాక్సీవాలా సినిమాలతో  వరుస విజయాలను  చవి చూసిన విజయ్కి  ఈ చిత్రం  షాక్ ఇచ్చింది. 



ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో నూతన దర్శకుడు  భరత్ కమ్మ తెరకెక్కించిన  ఈచిత్రంలో  కన్నడ బ్యూటీ రష్మిక  మందన్న విజయ్కి  జోడిగా నటించింది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా  నిర్మించాయి.  ఇక ఇదిలా ఉంటే  ఈచిత్రం ఈనెల 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుందని సమాచారం. సినిమా విడుదలైన 40 రోజుల తరువాతే  ప్రైమ్ లో విడుదలచేయాలని  నిర్మాతల మండలి ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం అన్ని సినిమాలను  అలాగే విడుదలచేసుకుంటూ వస్తుంది  ప్రైమ్. 



ఇక ఈ చిత్రంతోపాటు  సందీప్ కిషన్ నటించిన  రీసెంట్ మూవీ 'నిను వీడని నీడను నేనే'  కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుందట. డియర్ కామ్రేడ్ కన్నా ముందుగా ఈ చిత్రాన్ని  ఈనెల 23 న ప్రైమ్ లో విడుదలచేయనున్నారని తెలుస్తుంది. గత నెలలో విడుదలైన ఈచిత్రం  యావరేజ్ రేటింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటలేకపోయింది.  కార్తీక్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రంలో అన్య సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఎప్పటి నుండో  ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: