టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్ దేవరకొండ కి  'డియర్ కామ్రేడ్' సినిమా షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సినిమా సక్సెస్ కాకపోవడంతో అందరూ షాక్ తిన్నారు. ఎందుకంటే  వీరిద్దరిదీ హిట్ పెయిర్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గీత గోవిందం’ అదిరిపోయే హిట్ అందుకుంది. ఇటువంటి క్రమంలో తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ -రష్మిక మందన తో కలిసి నటించడానికి రెడీ అయినట్లు సమాచారం.


ఇక విషయంలోకి వెళితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విజయ్ పక్కన హీరోయిన్ గా రష్మిక ను తీసుకుంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో  ముగ్గరు హీరోయిన్స్ ఉంటారని, అందులో రష్మిక ఒకరని చెప్తున్నరు. పూరి జగన్నాథ్ ఈ సినిమాని పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దబోతున్నట్లు చెప్తున్నారు. అయితే రష్మిక పూర్తిగా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉంది. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ సరసన చేస్తోంది. మరో ప్రక్క నితిన్ తో భీష్మ చేస్తోంది.


అల్లు అర్జున్,సుకుమార్ కాంబో చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసారు. దాంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వటం కష్టమవుతోందనే అంటున్నారు. అయినా ఎలాగైనా ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలని పూరి భావిస్తున్నారు. మరోపక్క పూరిజగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమా అనగానే సోషల్ మీడియాలో  ఈ సినిమాపై మంచి రెస్పాన్స్ ట్రేడ్ మొదలయ్యింది. అయితే మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో ఉన్న పూరి జగన్నాథ్ కి తాజాగా తాను దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తో వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. మరోపక్క వరుస విజయాల మీద ఉన్న విజయ్ దేవరకొండ పూరి తో సినిమా అనగానే ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: