ఈ మధ్య బాగా కలెక్షన్లతో దూసుకుపోవడమే కాకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్..  రామ్ పోతినేని, నబా నాటేశ, నిది అగర్వాల్  కలిసి నటించిన ఈ సినిమా విడుదల అయినా కొద్దీ రోజుల్లోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రామ్ సినీ చరిత్రను ఈ సినిమా తిరగ రాసిందని చెప్పాలి. ముందెన్నడూ కనిపించని విదంగా రామ్ ఈ సినిమాలోకనిపించడం ఈ సినిమాకు ఒక ప్లస్ అయిందని చెప్పాలి. 


మాస్ డైరెక్టర్ పూరి కూడా తన మార్కును చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. అయన డైరెక్షన్, రామ్ యాక్షన్ ఈ సీమను మరో స్థాయికి తీసుకెళితే, సినిమాలో నటించిన హీరోయిన్ నబా యాటిట్యూడ్ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం రామ్, నబా తప్ప మిగిలిన వాళ్ళందరు పాల్గొన్నారు. 


నిజానికి వీరిద్దరూ అమెరికాలో ఉండటం వల్ల ప్రమోషన్లో పాల్గొనాలేదని ఆమె వెల్లడించింది. విషయమేంటంటే రామ్ విదేశాలకు వెళ్లడం మూలంగా రాలేక పోయారని , నబా మాత్రం ఏమి ఎరగనట్లు దూరంగా ఉండిపోయింది. ఈ సినిమా తర్వాత ఈమెకు వర్మ బీర్ పార్టీ ఇచ్చారన్న విషయం అందరికి తెలిసిందే.. ఆ ఘోరమైన పార్టీ తర్వాత ఆమెకు జ్వరమొచ్చింది అని చెప్పింది. 


ఇంకా చేసేదేమి లేక ప్రొమోషన్ కు, సక్సెస్ మీట్ కు కూడా హాజరుకాలేక పోయానని ఆమె వెల్లడించింది. ఈ మీటింగులకు అటెండ్ అయినా నిధికి మంచి ప్రసంశలు దక్కాయని ఆమె వ్యాఖ్యానించింది. ఇకపోతే ఈమె కు ఈ సినిమా సక్సెస్ కావడంతో మరో సినిమాలలో నటించడానికి  అవకాశాలు వచ్చాయని పేర్కొంది. మరి ఆ సినిమాలలో ఈమె ఆ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి ..


మరింత సమాచారం తెలుసుకోండి: