బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో ఇంతకముందు జై సింహా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం సక్సస్ కాలేదు. అయినా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ థాయ్ లాండ్ లో శరవేగంగా జరుగుతోంది. వాస్తవంగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. కాకపోతే సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు రేసులో ఉండడంతో, డిసెంబర్ కే సినిమాను సిద్ధం చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ ఇదివరకే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. 

అయితే సినిమాను డిసెంబర్ కు రెడీ చేస్తున్నప్పటికీ బాలయ్య ఆశలు మాత్రం ఇంకా సంక్రాంతి పైనే ఉన్నాయి. కుదిరితే సంక్రాంతికే సినిమాను విడుదల చేయమని బాలయ్య సి.కల్యాణ్ కు మరోసారి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సి.కల్యాణ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తాజా సమాచారం.ఇప్పటికే 2020 సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం సినిమాలు రిలీజ్ అవడానికి సిద్దమవుతున్నాయి. వీటిలో బన్నీ చేస్తున్న 'అల వైకుంఠపురం' సంక్రాంతికి వచ్చేది కాస్త అనుమానమే అంటున్నారు. అందుకే ఈ సినిమా ప్రొగ్రెస్ ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడట నిర్మాత సి.కల్యాణ్.

ఒకవేళ బన్నీ సినిమా అనుకున్న టైమ్ కు సిద్ధంకాకపోతే వెంటనే బాలయ్య సినిమాను ఆ స్థానంలో బరిలోకి దింపాలనేది సి.కల్యాణ్ ఆలోచన అని తెలుస్తోంది. బన్నీ సినిమా అనుకున్న టైమ్ కు రెడీ కాదనేది సి.కల్యాణ్ గట్టి నమ్మకమని అనుకుంటున్నారు. దీనికి కారణం త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు. చెప్పిన టైమ్ కు సినిమాను సిద్ధం చేయలేడని త్రివిక్రమ్ అని ఇప్పటికే ఒక రూమర్ ఉన్న విషయం అందరికి తెలిసిందే.

అనుకున్నట్టుగా సినిమా రావడానికి అవసరమైతే ఎక్కువ సమయం తీసుకుంటాడు మన మాటల మాంత్రీకుడు. కానీ అల వైకుంఠపురం విషయంలో మాత్రం ఇలాంటి జాప్యం ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం హారిక-హాసిని నిర్మాతల ప్రాజెక్టు కాదు, ఇందులో అల్లు అరవింద్ కూడా భాగస్వామిగా ఉన్నారు. అందుకే సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోతే అల్లు అరవింద్ ఊరుకునే ప్రసక్తిలేదు. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య సినిమా పరిస్థితి ఏంటి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: