బాహుబలి రెండు భాగాల సినిమాలతో, తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో వినిపించేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా, ఒకప్పటి స్వాతంత్రోద్యమ కాలం నాటి కథగా రూపొందుతోందని, అలానే ఇందులో రామ్ చరణ్, అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుంటే, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా యూనిట్ తెల్పింది. ఇకపోతే అక్కడక్కడా చిన్న గ్యాపులు వచ్చినప్పటికీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ ల ఇద్దరూ పాల్గొంటున్నట్లు సమాచారం. 

అయితే ఇటీవల ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసిన హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్, కొన్ని అనుకోని కారణాల వలన సినిమా నుండి తప్పుకోవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్, మరొక హీరోయిన్ వెతుకులాటలో పడింది. అయితే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ పై సస్పెన్స్ మాత్రం వీడలేదు. మొదట్లో కొందరు ఎన్టీఆర్ ప్రక్కన రష్మికను ఎంపిక చేసారని, అలానే మరికొందరేమో సాయి పల్లవిని అని, ఇంకొందరేమో శ్రద్ధ కపూర్ అని, ఇలా పలు రకాల వార్తలు ప్రచారం చేయడం జరిగింది. ఇక ఈ విషయమై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వెలువడుతున్న సమాచారం ప్రకారం, 

ఆర్ఆర్ఆర్ టీమ్ కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రక్కన నటించే హీరోయిన్ ని ఫైనలైజ్ చేయడం జరిగిందని, ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం బయటకు రాకుండా రహస్యంగా ఆమెతో షూటింగ్ కానిచ్చేస్తున్నారట. మరోవైపు ఆ హీరోయిన్ పేరు, యూనిట్ సభ్యుల్లోని ఎవరూ కూడా బయటపెట్టకూడదని హుకుం కూడా జారీ చేసారట ఆర్ఆర్ఆర్ దర్శక, నిర్మాతలు. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో, అసలు ఆ హీరోయిన్ ఎవరో, ఏమిటో అనే విషయాలపై సినిమా యూనిట్ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడాల్సిందే......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: