ప్రభాస్ ను డార్లింగ్ అంటూ యూత్ విపరీతమైన అభిమానంతో పిలుచుకుంటారు. అయితే ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో మాత్రం ప్రభాస్ కు నాలుగు తరాల అభిమానులు ఉన్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని శ్యాం ప్రసాద్ నిన్న జరిగిన ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈ వెంట లో బయట పెట్టాడు. 

తన తల్లికి 88 సంవత్సరాలు అని చెపుతూ తాను ‘సాహో’ ఫంక్షన్ వెళుతున్న విషయం తన తల్లికి చెపితే ప్రభాస్ ఆరు అడుగుల పొడుగుతో చాల అందంగా కనిపిస్తాడని చెప్పడంతో తన మైండ్ బ్లాంక్ అయిన విషయాన్ని బయట పెట్టాడు. తన తల్లి అలా ప్రశంసలు కురిపించగానే 55 సంవత్సరాల వయస్సులో ఉన్న తన భార్య అపోలో హాస్పటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న తన సోదరి కాలేజీలో చదువుకుంటున్న తన మేనకోడలు చివరకు 5 సంవత్సరాల వయస్సులో ఉన్న తన మనవడు తామంతా ప్రభాస్ అభిమానులం అని చెప్పడంతో తాను ఆశ్చర్య పడ్డ విషయాన్ని వివరించాడు.

సాధారణంగా ఒక యంగ్ హీరోకు నాలుగు తరాలకు సంబంధించిన అభిమానులు ఉండరనీ ఆ విషయంలో ప్రభాస్ అదృష్టవంతుడు మాత్రమే కాకుండా అభిమానుల విషయంలో కూడ ప్రభాస్ రికార్డులను ఎవరు అందుకోలేరు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ‘సాహో’ మూవీ మ్యానియా గురించి మాట్లాడుతూ ఈమూవీని మొదటిరోజునే చూడాలని తన కుటుంబ సభ్యులు అంతా భావించడమే కాకుండా వారి స్నేహితులతో కలుపుకుని తనను ‘సాహో’ కు సంబంధించి 50 టిక్కెట్లు తెచ్చి తీరాల్సిందే అంటూ డిమాండ్ చేయడంతో ఇప్పుడు తనకు ‘సాహో’ టిక్కెట్స్ టెన్షన్ మొదలైంది అంటూ జోక్ చేసాడు. 

శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాటలు యధాలాపంగా అన్నట్లు కనిపించినా ‘సాహో’ టిక్కెట్ల గురించి సెలెబ్రెటీల కుటుంబాలలో కూడ ఎంత డిమాండ్ ఉందో అర్ధం అవుతుంది. వీరితో పాటు ‘సాహో’ సృష్టిస్తున్న మ్యానియాతో ఈ మూవీ టిక్కెట్ల కోసం ప్రముఖుల కుటుంబాలలోని వ్యక్తులు అంతా ఒకేసారి ప్రయత్నిస్తే అసలు ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయా టిక్కెట్లు దొరకక పోవడంతో ఈ మూవీ టిక్కెట్లు బ్లాక్ మార్కట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: