స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురంలో.. కాగా కొద్దీ రోజుల క్రిందట విడుదలైన ఈ చిత్రం యొక్క టైటిల్ టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఇటీవలే ఈ చిత్రం కాకినాడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈషెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ విలువ 5కోట్లు అని సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది. ఇక ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి టబు, మురళి శర్మ , జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తమన్ ఇంతకుముందు బన్నీ నటించిన రేసుగుర్రం , సరైనోడు సినిమా లకు సంగీతం అందించగా అవి ఆడియో పరంగా కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక వాటికీ దీటుగా ఈ అల .. వైకుంఠపురము లో ఆడియోను కంపోస్ చేస్తున్నాడట తమన్. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇంతకుముందు బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించడం తో ఈ మూడో సినిమా ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.