స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురంలో..  కాగా కొద్దీ రోజుల క్రిందట విడుదలైన ఈ చిత్రం యొక్క టైటిల్  టీజర్  ప్రస్తుతం యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.  ఇక  ఇటీవలే ఈ చిత్రం  కాకినాడ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క  తదుపరి  షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈషెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో  ఓ భారీ హౌస్ సెట్ ను నిర్మిస్తున్నారు.  ఈ సెట్ విలువ 5కోట్లు అని సమాచారం. ఈ షెడ్యూల్  తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.   ఇక  ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. 



  ఈ సినిమాలో   బన్నీ  సరసన  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా    సీనియర్ నటి టబు, మురళి శర్మ , జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు  కీలక పాత్రల్లో  కనిపించనున్నారు.   తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇక తమన్ ఇంతకుముందు  బన్నీ నటించిన  రేసుగుర్రం , సరైనోడు  సినిమా లకు  సంగీతం అందించగా  అవి ఆడియో పరంగా కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక వాటికీ  దీటుగా ఈ  అల .. వైకుంఠపురము లో ఆడియోను కంపోస్ చేస్తున్నాడట  తమన్.   వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.  ఇంతకుముందు బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించడం తో ఈ మూడో సినిమా ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: