రాజమౌళి ఎలాంటి కథలతో అయినా మ్యాజిక్ చేయగలడు.. సూపర్ హిట్ కొట్టగలడు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మర్యాద రామన్న పేరులో సునీల్ ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. భారీ హిట్టైంది. సునీల్ లాంటి కమెడియన్ ను హీరోగా పెట్టి సినిమా తీయడం అంటే గ్రేట్ అని చెప్పాలి. సినిమా సూపర్ హిట్టైంది. ఈ సినిమా తరువాత మరలా ఇలాంటి ప్రయోగమే చేశాడు.
అదే ఈగ. నాని హీరోగా తీసినా.. ఇందులో ఎక్కువుగా కనిపించేది ఈగనే. ఈగ సినిమా హాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తీసిందే అయినప్పటికీ సినిమా సూపర్ హిట్టైంది. రాజమౌళి సినిమా తీశాడు అంటే సినిమా హిట్ కొట్టడం ఖాయమే అని ఆ సినిమాతో మరోమారు నిరూపణ జరిగింది. హీరోలతోనే కాదు అవసరం అయితే జంతువులతో కూడా హిట్ కొట్టగలడు అని నిరూపించాడు.
ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఎలాగో ఈగ పేరుతో సినిమా తీశారు.. హిట్ కొట్టారు. వాటి కజిన్ బ్రదర్స్ గా చెప్పుకునే దోమలు ఏం పాపం చేశాయి. వాటి పేరుతో రాజమౌళి సినిమా తీస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు చాలామంది. తీస్తే బాగానే ఉంటుంది. కాకపోతే దానికి రాజమౌళి ఒప్పుకోవాలి కదా. దానికి తగ్గట్టుగా కథ దొరకాలి కదా.
రాజమౌళి అనుకోవాలే గాని కథ ఎంతసేపటిలో దొరుకుతుంది. ఎలాగో విజయేంద్రప్రసాద్ ఉన్నారు కథ అందించడానికి. అయన సీనియర్ మోస్ట్ కథకుడు. రాజమౌళి సినిమాలకు ఆయనే కథ అందిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈగ కథను రసరమ్యంగా తీసిన రాజమౌళికి దోమ కథతో సినిమా సినిమాను అదే విధంగా ట్విస్ట్ లతో అద్భుతంగా తెరకెక్కించగలరు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత ఇలా ఓ ఎంటర్టైనర్ తెస్తే.. కాస్త రిలాక్స్ గా ఉంటుందేమో.