మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ నుండే సైరా ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ అనుకున్నట్టుగానే ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేస్తుంది. అయితే ముంబైలో సైరా టీజర్ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈవెంట్ కు సినిమాలో నటించిన బిగ్ బీ అమితాబ్ రాకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.


అమితాబ్ ముంబైలో ఉండి కూడా సైరా టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం అంతగా బాగా లేదని టాక్. ఆయన టిబితో బాధపడుతున్నారట. గత ఎనిమిదేళ్ల క్రితమే టిబి ఉన్నా గుర్తించలేదని తెలుస్తుంది. అంతేకాదు అమితాబ్ లివర్ 75 శాతం చెడిపోయిందని డాక్టర్స్ చెప్పారట.    


ప్రస్తుతం ఆయన 25 శాతం కాలేయంతోనే బ్రతుకుతున్నానని అమితాబే స్వయంగా ఈమధ్య చెప్పారు. అయితే మందులతో అది కవర్ అవుతుందని తెలుస్తుంది. కేవలం అనారోగ్య కారణంగానే అమితాబ్ ఈరోజు జరిగిన సైరా టీజర్ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయారని తెలుస్తుంది. అమితాబ్ రాకున్నా చిరుతో సహా చిత్రయూనిట్ మొత్తం అమితాబ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి మాట్లాడారు. 


చిరంజీవి అయితే ప్రత్యేకంగా సినిమాలో తన గురువే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయన తనకు గురువంతటి వారని అన్నారు. ఇండియా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని అన్నారు చిరంజీవి. సైరా సినిమాకు రాం చరణ్ కేవలం నిర్మాత కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడలేదు. తండ్రి కలను నిజం చేసేందుకు మాత్రమే తాను ఈ సినిమా చేసినట్టు వెళ్లడించారు. అక్టోబర్ 2న సైరా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాను బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్, రితేష్ ఇద్దరు కలిసి ఎక్సెల్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.  
       



మరింత సమాచారం తెలుసుకోండి: