మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సైరా టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా టీజర్ విడుదలతోపాటు ప్రమోషన్ కార్యక్రమాలను ముంబైలో అట్టహాసంగా మొదలు పెట్టారు. ఈ సందర్భంగా చిరుతో పాటు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ దక్షిణాది నటులు సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
అయితే సైరా సినిమాలో చిరంజీవికి గురువుగా చేసిన బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలోనే ఉండి ఈ ప్రమోషన్ టీజర్ ఫంక్షన్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్న అందరినీ వెంటాడింది. అయితే ఆయన టీబీ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న కారణంగానే చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్ కు రాలేదని బాలీవుడ్ మీడియా నుండి అందిన తాజా సమాచారం. 

అయితే ఈ టీబీ వ్యాధి చాలా ఆలస్యంగా అమితాబ్ కు బయటపడుతుందని ఇటీవలే తెలిపారు. ఈ మధ్యే అమితాబ్ వైద్య పరీక్షలు చేసుకోగా..దాదాపు 8 ఏళ్ల క్రితమే ఇది అటాక్ అయ్యిందట.. ఇప్పటికీ వైద్య పరీక్షల్లో ఆలస్యంగా బయటపడిందని తెలిపాడు. గతంలో టీబీ , హైపటైటిస్ వ్యాధులు అమితాబ్ ను వేధించాయి. వాటికి ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మందులు వాడుతున్నా అవి పూర్తి స్థాయిలో తగ్గలేదట.. ప్రస్తుతం అమితాబ్ కాలేయం 75శాతం చెడిపోయిందని వైద్యులు తెలిపారట.. కేవలం 25 శాతం కాలేయంతోనే తాను బతుకుతున్నానని.. మందులతో కవర్ అవుతోందని అమితాబ్  ఇచ్చిన మీడియా సమావేశంలో తెలిపాడు.   
 
76 ఏళ్ల అమితాబ్ పలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. చికిత్స తీసుకుంటూనే ‘సైరా’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు సైరా ముంబై ప్రమోషన్ లో అనారోగ్య కారణాల వల్లే అమితాబ్ పాల్గొనలేదని సమాచారం. ఏదేమైనా బాలీవుడ్ మెగాస్టార్, టాలీవుడ్ మెగాస్టార్ కలిసి సైరా లో నటించడం చరిత్రలో మిగిలిపోయో అరుదైన అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: