సాహో సినిమా ప్రమోషన్ ఇప్పటికే హోరెత్తిస్తుంది. కానీ ఎందుకో ఈ సినిమా విషయంలో ఏదో తేడా కొడుతోంది. ఇప్పటి వరకు విడుదల అయిన ఈ సినిమా పాటలు కనీసం ప్రేక్షుకులు మెచ్చుకునే రీతిలో కూడా లేవు. ఏదో బాలీవుడ్ పాటలను తెలుగులోకి డబ్ చేసిన ఫీలింగ్ మన జనాలకు వస్తుంది. ఈ సినిమా మేకింగ్ కూడా పూర్తిగా బాలీవుడ్ ను బేస్ చేసుకొని తీసినట్టుంది గాని తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం రావటం లేదు. నిజానికి రేపు ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం ముందుగా డైరెక్టర్ సుజిత్ కు పెద్ద దెబ్బ పడుతుంది. ఇక హీరో ప్రభాస్ కు తన మార్కెట్ తగ్గే ప్రమాదం ఉంది. ఇక నిర్మాతలకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. 

ఇక రామోజీ ఫిలిం సిటీలో అంగ రంగ వైభవంగా జరిగిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ అభిమానులు మధ్య కోలాహలంగా జరిగింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడకి వచ్చిన రాజమౌళి, దిల్ రాజు .. సుజిత్ ను ఓ రేంజ్ లో మెచ్చుకున్నారు. రాజమౌళి అయితే సుజిత్ చిన్న వయసులోనే ఇంత పెద్ద సినిమాను తీస్తాడని అనుకోలేదని .. మేకింగ్ వీడియో చూసినప్పుడే ఈ సినిమా స్టామినా .. సుజిత్ స్టామినా ఏంటో అర్ధం అయ్యిందని చెప్పుకొచ్చారు.


ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. భారీ సినిమాను తీయడానికి రాజమౌళికి ఇన్నేళ్లు పడితే సుజిత్ కు కేవలం రెండవ సినిమాకే సాధ్య మైందని చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ బాహుబలి లాంటి సంచలన మూవీ తరువాతి సినిమా పెద్ద డైరెక్టర్ దర్శకత్వంలో ఉంటుందని చాలా మంది ఊహించారు. కానీ అనూహ్యంగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న అది కూడా శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమా తీసిన దర్శకుడు సుజిత్ కి అవకాశం ఇస్తారని ఎవరు ఊహించలేదు. కానీ సుజిత్ మాత్రం ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: