నిన్న విడుదలైన ‘సైరా’ టీజర్ కు మెగా అభిమానుల నుండి మాత్రమే కాకుండా వివిధ వర్గాల ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ టీజర్ పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ తో మొదలౌతుంది అన్న విషయం తెలుసుకుని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ వీరాభిమానులకు మాత్రం కొంత అసంతృప్తిని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం ఈ టీజర్ పవన్ వాయస్ ఓవర్ తో ప్రారంభం అయినా అదేమంత ఉత్తేజకరంగా లేకపోవడమే కాకుండా మధ్యలో వేరే వాయస్ కూడ వినిపించడం పవన్ అభిమానులకు అసంతృప్తిని మిగిల్చింది. దీనితో ఉద్వేగపూరితమైన వాయస్ ఓవర్ విందామని ఆశించిన పవన్ అభిమానులు ఆ ఉద్వేగపూరితమైన స్థాయిలో పవన్ గొంతు లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా ‘చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను. కానీ, ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’ అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్‌ లో ఇంకా ఫైర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని పవన్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 

ఇది ఇలా ఉండగా నిన్న ముంబాయిలో జరిగిన ‘సైరా’ టీజర్ లాంచ్ ఫంక్షన్ లో ‘సైరా’ సినిమాలో కూడా పవన్ గొంతు వినిపించనుంది అన్న విషయాన్ని స్వయంగా చిరంజీవి బయటపెట్టాడు. ‘సైరా’ మూవీ పవన్ కళ్యాణ్ వాయస్ ఓవర్ తో మొదలు కావడమే కాకుండా క్లైమాక్స్ లో కూడ పవన్ వాయస్ ఓవర్ ఉంటుంది అని చిరంజీవి చెప్పడంతో ఆ మూవీ డబ్బింగ్ విషయంలో అయినా పవన్ వాయస్ ఓవర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని పవన్ వాయస్ ఓవర్ ఎలివేట్ అయ్యేలా చేస్తే బాగుంటుందని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: