‘సైరా’ టీజర్ కు అనూహ్య స్పందన కొనసాగుతూనే ఉంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది సేపటికే వరుణ్ తేజ్ ఉపాసన సాయి తేజ్ నిహారిక కళ్యాణ్ దేవ్ లు ఈ టీజర్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేయడమే కాకుండా చిరంజీవిని ఆకాశంలోకి ఎత్తేసారు. అయితే ఇంత హడావిడి జరుగుతున్నా ఈ టీజర్ గురించి అల్లు అర్జున్ అల్లు శిరీష్  అల్లు బాబీలు ఒక్క కామెంట్ కూడ షేర్ చేయకపోవడం మెగా అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది.

వాస్తవానికి బన్నీ త్రివిక్రమ్ మూవీలో బిజీగా ఉన్నాడని సరిపెట్టుకున్నా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ కు ఏమైందీ అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అల్లు మెగా కాంపౌండ్ ల మధ్య చిన్న దూరం ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నా ఆ విషయాలు బయటపడకుండా ఎప్పటికప్పుడు చిరంజీవి అరవింద్ లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. 

దీనికితోడు వరుణ్ తేజ్ హాలిడే ట్రిప్ లో ఉన్నా సాయి తేజ్ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నా ఉపాసన ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ కోసం గ్రీసు వెళ్ళినా అక్కడ నుండే ‘సైరా’ టీజర్ పై స్పందించారు. దీనితో బిజీగా ఉన్నంత మాత్రాన బన్నీ ‘సైరా’ గురించి ఒక్క కామెంట్ చేయడానికి సమయం లేదా అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు.

దీనితో ‘సైరా’ టీజర్ పుణ్యమా అని మళ్ళీ మెగా అల్లు కాంపౌండ్ ల మధ్య ఉన్న గ్యాప్ బయటపడిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎలాగు శుభాకాంక్షలు చెప్పాలి కాబట్టి ఈ రెండు విషయాలను కలిపి అప్పుడు స్పందిస్తే సరిపొతుంది అన్న ఉద్దేశ్యంతో అల్లు బ్రదర్స్ మౌనం వహించి ఉంటారు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: