ఎనభై - తొంభైల్లో చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే వేరే సినిమాల నిర్మాతలు తమ సినిమాకు మరో డేట్ చూసుకునేవారు. మెగాస్టార్ హవాకు దాదాపు వారం పాటు దరిదాపుల్లో ఉండేవి కావు ఏ సినిమాలు. అంతటి స్టార్ డమ్ మెగాస్టార్ ది. త్వరలో మెగాస్టార్ సైరా రిలీజ్ కాబోతోంది. దాని గురించి ఇప్పటినుంచే ధియేటర్ల లిస్టు మొదలెట్టేశారు. కానీ ఓ తమిళ సినిమా చిరంజీవి సినిమాతో పోటీ పడుతోందని వార్తలొస్తున్నాయి.

 


తమిళ నటుడు కార్తీ ఖైదీ అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు ఎప్పటి నుంచో సరైన డేట్ దొరకట్లేదు. ఇప్పుడు ఆ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు కోలీవుడ్ సమాచారం. కార్తీ సినిమాలు తెలుగులో కూడా తమిళ్ తో పాటు ఒకే డేట్ లో రిలీజ్ అవుతాయి. మెగాస్టార్ సైరా రిలీజ్ ను అక్టోబర్ 2 రిలీజ్ అని ప్రకటించేశారు. అయితే సైరా కంటే ముందు కేవలం 5 రోజుల గ్యాప్ తో ఈ సినిమా వస్తుంది. సైరా వచ్చాక చిరంజీవి సినిమా ధాటికి దాదాపు ధియేటర్లన్నీ సైరాతో నింపేయడం ఖాయం. అటువంటప్పుడు చిరంజీవితో పోటీకి కార్తీ తెగిస్తున్నాడా.. ధైర్యం చేస్తున్నాడా.. అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

 


ఇండియాలో భారీగా విడుదలవుతున్న సైరాకు ధియేటర్లు ఎక్కువ కావాలి. తమిళ్ లో కార్తీ సినిమా రిలీజ్ పక్కానే అయినా ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సంశయిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పడు కేవలం రెవెన్యూ కోసమే సినిమా లెక్కలు మారిపోయాయి. ధియేటర్లే ప్రధానం-కలెక్షన్లే ముఖ్యం. దాంతో ఎంత స్టార్ సినిమా అయినా నాలుగు రోజులు అటు ఇటూగానే రిలీజ్ అవుతున్నాయి. మరి ఇంతటి ధియేటర్ల కాంపిటీషన్లో కార్తీ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: